బిజేపీ పార్టీని సంస్థాగతంగా గ్రామగ్రామానా బలోపేతం చేయడమే తన ముందు వున్న ప్రధాన లక్ష్యమని.. తెలంగాణ బీజేపి పగ్గాలను నూతనంగా అందుకున్న డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేసేలాగా చర్యలు తీసుకోవడమే తన ముందున్న లక్ష్యమన్నారు. అలాగే కేం ద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. వాటిని కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని అన్నారు.
భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మిగతా పార్టీల మాదిరిగా వారసత్వాలకు చోటు ఉండదన్నారు. ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో పని చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందే తప్ప ఏ ఒక్కరికి సంబంధించిన అవమే కాదన్నారు. తాను కూడా కార్యకర్తతో మొదలుకుని ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ విభాగాల్లో పనిచేశాని ఆ విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పార్టీ అధిష్టానం అధ్యక్ష బాధ్యతలను అప్పగించిందని, వాటిని కూడా నిబద్దతగా నిర్వహిస్తానన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాలను శిరసావహిస్తాను.
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తనపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానన్నారు. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా, సీనియర్ నాయకుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పని చేస్తానని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో 2019 నాటికి బలీయమైన శక్తిగా, ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని చెప్పారు. బీజేపీకి సిద్ధాంతపరమైన బలమైన నిర్మాణం ఉందని, ఎవరైనా అందుకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. పార్టీలో సీనియర్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, జూనియర్లను కలుపుకుని ముందుకెళ్తాను. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more