యువ మేధావులను తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయాలలో కుల, మతాల అధారంగా విద్యార్థుల మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలను సృష్టిస్తుందని, ఇందుకోసం వారి స్టూడెంట్ వింగ్ ఏబీవీపీని కూడా వాడుకుంటుందని నర్మదా బచావో ఉద్యకారిణి, నేషనల్ అలెయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ జాతీయ నాయకురాలు మేధాపాట్కర్ అరోపించారు. హెచ్సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆమె ఆదివారం రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. లోపలికి వెళ్లకుండా ఆమెను ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గేట్ వద్దకు చేరుకున్న విద్యార్థులను ఉద్దేశించి గేటు బయట నుంచే మేధాపాట్కర్ మాట్లాడుతూ.. హెచ్సీయూ విద్యార్థి రోహిత్, రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని అమె అన్నారు. రోహిత్ తల్లి చెప్పిన దాన్నిబట్టి అతడు చాలా ధైర్యవంతుడని, అతనుంటే ఉద్యమానికి నాయకత్వం వహించేవాడని, లేకున్నా ముందుండి నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. లోపలికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం చూస్తుంటే లోపల ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం అవుతోందన్నారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి.. బంజారాహిల్స్లోని లామకాన్కు చేరుకున్న మేధాపాట్కర్ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కులవివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయని, అగ్రవర్ణాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. రోహిత్ మరణం తర్వాత యూనివర్సిటీల్లో తలెత్తిన పోరాటాలపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుబట్టారు. హెచ్సీయూలో జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
వీసీ అప్పారావు వద్దంటూ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చేపడుతున్నా ఆయన్నే కొనసాగించడం సమంజసం కాదన్నారు. హెచ్సీయూ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఈ నెల 6న వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా తలపెట్టిన చలోఅసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రైతుల హక్కులు కాపాడాలని, పర్యావరణ హితంగా, రైతుల ప్రయోజనాలు నెరవేరేలా ముందుకు సాగాలని కోరారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more