మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆబ్కారీశాఖ నూతన రికార్డు సృష్టించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి నూరు శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యంలో ఏకంగా 99.53 శాతం టార్గెట్ను సాధించింది. రూ. 12,200 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను నెలకు సుమారు రూ. 1,000 కోట్ల మద్యం అమ్మకాల డిమాండ్తో మార్చి 31 నాటికి రూ. 12,143 కోట్లు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 10,238 కోట్ల ఆదాయంకన్నా ఈసారి దాదాపు రూ. 2 వేల కోట్లు అదనంగా అందుకుంది.
రాష్ట్రంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్బీసీఎల్) ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయించే దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్), బీర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ప్రాతిపదికగా తీసుకుంటా రు. 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి 31 వరకు రాష్ట్రంలో 238 లక్షల కే స్ల ఐఎంఎఫ్ఎల్ను విక్రయించారు. 2014-15లో 148 లక్షల కే స్ లను మాత్రమే విక్రయించగా ఈసారి ఏకంగా 90 లక్షల కేస్లు అదనం కావడం గమనార్హం. ఇక బీర్ల విక్రయాల్లో గత ఆర్థిక సంవత్సరం 282 లక్షల కేస్లను విక్రయించగా 2015-16లో ఏకంగా 334 లక్షల కేస్లు (52 లక్షల కేస్లు అదనం) విక్రయించారు. వీటితోపాటు లెసైన్స్ ఫీజులు, ఎక్సైజ్ డ్యూటీ తదితరాల ద్వారా సమకూరిన మొత్తం రూ. 12.143 కోట్లుగా ఓ అధికారి తెలిపారు.
ఎక్సైజ్ శాఖ 12 నెలల కాలంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 12 వేల కోట్లకుపైగా సమకూర్చుకున్నా పన్నులు, ఇతర ఖర్చులు పోగా ఎక్సైజ్ శాఖకు మిగిలింది మాత్రం సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే. మద్యం ద్వారా వచ్చిన రాబడిలో విలువ ఆధారిత పన్ను రూపంలో (వ్యాట్ బై ఎక్సైజ్) రూ. 8,160 కోట్లు (67 శాతం) వాణిజ్యపన్నుల శాఖకు చేరిపోగా సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్కు మరో రూ. 222 కోట్లు జమ అయింది. లెసైన్సు ఫీజు కింద రూ. 1,859 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.1,660 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ. 231 కోట్లు కలుపుకొని ఆబ్కారీ శాఖకు సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే మిగిలింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more