అటు హాలీవుడ్ బుల్లితెరలో ఓ వెలుగువెలుగుతూ, ఇటు బాలీవుడ్ తెరపై తళుక్కున మెరుస్తూ తన సత్తా చాటుకుని మున్ముందుకు దూసుకుపోతున్నా బ్యూటీ ప్రియాంక చోప్రా పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు సంచలన ట్వీట్లు చేశాడు. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన ప్రియాంక చోప్రాకు సంబంధించిన కొన్ని విషయాలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. 'ప్రియాంక ఇప్పుడు ఆత్మస్థైర్యంతో కనబడుతుందేమోగానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కెరీర్ లో నిలదొక్కుకునే క్రమంలో ఆమె రెండు, మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే సమయానికి తా.ను అక్కడకు చేరుకున్నాడు కాబట్టి అపగలిగానని కూడా ట్విట్ చేశాడు.
ప్రియాంక మాజీ ప్రియుడు అసీమ్ మర్చంట్ తో సన్నిహితంగా ఉండేదని, ఓ సారి అతని జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని.. అప్పుడు కూడా తనే అడ్డుపడ్డానని చెప్పుకొచ్చాడు. ప్రియాంకకు అసీమ్ తల్లితో చాలా అనుబందం ఉందని, అసీమ్ తల్లి మరణించినప్పుడు కూడా ప్రియాంక బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలని చూసిందని, సమయానికి తనే ప్రియాంకను పట్టుకుని కుర్చీకి కట్టేసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నానని ట్వీట్లలో పేర్కొన్నాడు.
కొన్నేళ్ల ముందు ప్రియాంకకు, ప్రకాష్ కు మధ్య విబేధాలు తలెత్తడంతో ఆమె అతని కాంట్రాక్టును మధ్యలోనే రద్దు చేసింది. దీనిపై అతను ముంబై కోర్టును ఆశ్రయించాడు. ఆ తరువాత ప్రియాంక తండ్రి తన కుమార్తెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఇచ్చిన కంప్లైంట్తో ప్రకాష్ కొన్ని నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు.ప్రియాంకతోపాటు మరికొందరి పేర్లను కూడా ట్వీట్లలో ప్రస్తావించాడు. తెర మీద వెలిగిపోతూ కనిపించే చాలామంది తారల జీవితాల్లో చీకటి కోణం ఉంటుందని, అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆదివారం ట్వీట్లతో చెలరేగిపోయాడు
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more