చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లు ఉండటం. ఒక్క విద్యార్థి ఉంటే ముగ్గురు టీచర్లు ఉండటం జరుగుతోంది. అలా కాకుండా ఆ స్కూల్ కు దగ్గరలో ఉన్న స్కూల్ లో విలీనం చేసి.. ఆ విద్యార్థి చదువును కొనసాగించగలిగితే మంచిదని ప్రభుత్వం ఆలొచిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విలీనం మీద చురుకుగా చర్యలకు సాగుతోంది. జిల్లా స్థాయి అధికారులు ఈ మేరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించాలని ఆదేశాలు జారీఅయ్యాయి. విద్యాసంంవత్సరం మొదలయ్యే సమయానికి దీన్ని పూర్తి చయ్యాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల విలీనం జరుగుతుంది.
జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్ రేషనలైజేషన్ పై వర్కవుట్ చేస్తున్నారు అధికారులు. తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటిని దగ్గరల్లోని మరో స్కూల్లో విలీనం చేయాలని గతంలోనే సర్కార్ నిర్ణయించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే లోపే ఫుల్ డీటెల్స్ సేకరించే పనిలో పడ్డారు అధికారులు. మండలాల వారిగా ఉన్న స్కూళ్ల ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ వాటి స్టేటస్ తో సర్కార్ కు రిపోర్ట్ చేయనున్నారు..
గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడంతో స్కూళ్లను మెర్జ్ చేయాలని నిర్ణయించింది సర్కార్. వాటి నిర్వహణ భారం తగ్గించుకునేందుకు రేషనలరైజేషన్ ను తీసుకొస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్ దూరంలోపు ఓ గవర్నమెంట్ స్కూల్ ఉండాలన్న రూల్ ను తొలగించి, స్కూళ్ల విలీనాన్ని ప్రతిపాదించింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. అయితే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చినా సర్కార్ మాత్రం అనుకున్న విధంగానే ప్రాసెస్ కంప్లీట్ చేసే పనిలో ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more