ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల బాటలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పయనించనుంది. ప్రజా సేవకులం అంటూ చట్టసభలకు ఎన్నికయ్యే వారికి ఏకంగా లక్షలాధి రూపాయల ప్రజాధనాన్ని వేతనంగా ఇవ్వనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనల్లో.. ఇప్పటి వరకు రూ. 95 వేలుగా ఉన్న ఎమ్మెల్యేల జీతాన్ని రూ. 1 లక్షా 50 వేలకు పెంచాలని, హెచ్ఆర్ఏను రూ. 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించారు.
ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫించన్ను సైతం 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. రైల్వే చార్జీల నిమిత్తం లక్ష రూపాయలు, బుక్స్ అలవెన్స్ కింద లక్ష రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, వాహనాల అడ్వాన్స్కు గాను ఇంతకు ముందున్న 10 లక్షల రూపాయలను 20 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఈ భారీ పెంపుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
సామాన్య రైతులు కరువు ప్రభావంతో వందలు, వేల రూపాయల రుణాల కోసం అంగలార్చుతున్నసమయంలో వారిని పట్టించుకుని, కష్టాలను తీర్చే మార్గాలను అన్వేషించాల్సిన ప్రభుత్వాలు మాత్రం తమ హయాంలో ఫలాన జరిగిందని చెప్పుకునేందుకు గోప్పలకు పోతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలను పెంచే కార్యక్రమానికి ప్రధాన్యతను ఇస్తున్నాయి. ఎన్నికల సమయాల్లో ప్రజలకు ఇబ్బడుముబ్బెడుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అవి తీర్చిన తరువాత తమ వేతనాలను పెంచుకుంటే అక్షేపించే వాదనలు కూడా తెరపైకి రావన్న విషయాన్ని అధికార పక్షాలు మర్చిపోతున్నాయి.
నిరుద్యోగ యువత ఉపాధి లేక కనీసం ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా వారి తల్లిదండ్రులపైనే అధారపడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి వారికి కల్పించాలి. ప్రభుత్వాలు కోలువుదీరి రెండేళ్లు కావస్తున్నా.. అసలు ఆ ఊసే ఎత్తకుండా జీతాలను మాత్రం రెట్టింపు స్థాయికి పెంచుకోవడంలో అర్థమేమీటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది. మొత్తానికి ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను కూడా విస్మరించకుంటే మంచిదన్న వాదనలు వినిపిస్తున్నాయి
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more