దశాబ్దాల పాటు ఏకచక్రాధిపత్యంగా కొనసాగిన వామపక్షాల పాలన, వారితో పోరాటం చేస్తూ పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకించి, ప్రజలకు, సామాన్య రైతులకు అండగా నిలిచి వారి పక్షన ఉద్యమించి ఎట్టకేలకు అధికారాన్ని చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ ల మధ్యలోకి తమ ఉనికి లేని చోట కాసింతైన లబ్దిపోందాలని యోచిస్తూ.. ఆ దిశగా పయనిస్తున్న భారతీయ జనతా పార్టీ.. అదే క్రమంలో పూర్వవైభవం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలతో పశ్చిమ బెంగాల్ లో చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే నిజానికి చెప్పాలంటే వాస్తవంగా మాత్రం పోటీ వామపక్షాలకు, తృణముల్ పార్టీకి మధ్యే ఉంది.
అయితే ఈ విషయాన్ని మాత్రం బీజేపి నేతలు అంగీకరించడం లేదు. తమ సత్తా ఎంటో చాటుతామని, ఫలితాలు వెలువడిన రోజునే తమ పార్టీ కార్యచరణ, వ్యూహాలు, ప్రతివ్యూహాలు అందరికీ అర్థమవుతాయని అంటున్నారు. అధికార తృణముల్ కాంగ్రెస్ మళ్లీ అధికార పగ్గాలను అందుకునే అవకాశం వుందన్న ప్రీ ఫోల్ సర్వేలను కూడా తోసిరాజుతున్నారు. అందుకనే ఏకంగా అధికార తృణముల్ కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రిని టార్గెట్ చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఎలాగైన పశ్చిమ బెంగాల్ అధికార పగ్గాలను తాము అందుకోవాలన్న ఉద్దేశ్యంతో బాజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకంగా అక్కడే తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుని మరీ ప్రచార కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తృణముల్ కాంగ్రెస్ నేతలు లంచాలను తీసుకుంటూ కెమెరాలకు అడ్డంగా చిక్కారని, అయితే వారిని మమత బెనర్జీ పార్టీ నుంచి తొలగించారా.? అని ప్రశ్నించారు. దీనిపై తృణముల్ కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగానే స్పందించారు.
వ్యాపం స్కామ్ లో అరోఫణలు ఎదుర్కోంటున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పదవి నుంచి దింపిన తరువాత తమ వారిని ప్రశ్నించాలన్నారు. ఢిఢీసీఎ అంశంలో అరుణ్ జైట్లీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిని పక్కన బెట్టుకుని తాము నీతి వంతులమని ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. లలిత్ మోడీని అంశంలో అరోపణలను ఎదుర్కోంటున్న ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిపై చర్యలు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని చురకలంటించారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం అంశంతో ఇరువురూ కత్తులు దూసుకున్నారు. అమిత్షా కోల్కతాలో మాట్లాడుతూ.. ‘తృణమూల్ పాలనలో బెంగాల్లో బాంబుల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఆ బాంబు పేలుళ్ల మోతలతో ఠాగూర్ సంగీతం సైతం మరుగునపడి పోయింది’ అని అన్నారు. దీనిపై మమత బెనర్జీ మండిపడ్డారు. ‘బెంగాల్ను ఎవరైనా అవమానిస్తే.. వారికి నాకంటే పెద్ద శత్రువు మరొకరు ఉండరు. ఠాగూర్ వంటి గొప్పవారి గురించి అవమానకరంగా మాట్లాడితే బెంగాల్ ప్రజలు క్షమించరు’ అని చురక అంటించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more