కొన్ని సంఘటలు చూస్తే అసహ్యం వేస్తుంది. మనుషుల్లాగా కాకుండా విచక్షణలేని పశువుల్లాలా ప్రవర్తిస్తుంటారు కొంత మంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పాట్నా నుండి లోకమాన్యా తిలక్ సూపర్ ఫాస్ట్ రైల్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చేసిన చిన్న తప్పుకు అతి కిరాతకంగా ప్రవర్తించిన మృగాళ్ల రాక్షసత్వం వెలుగులోకి వచ్చింది. అతడు చేసిన చిన్న తప్పుకు అతడిని రైలు కిటికీకి కట్టేశారు. అలా కట్టేసి అతడిని బెల్ట్ లతో చర్మం ఊడేలా కొట్టారు. అక్కడున్న ప్రయాణికులు దీన్ని గమనించి ఆతడిని కిందకు దింపి రక్షించారు.
పాట్నాకు చెందిన సుమిత్ అనే వ్యక్తి ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ నెల 25వ తేది అతడు లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో రాత్రి 11 గంటలకు ఎక్కాడు. అయితే అతడికి దాహం వెయ్యడంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగాడు. అయితే తమను అడగకుండానే నీళ్లు తాగుతావా..? అంటూ ఆ బాటిల్ కు సంబందించిన వ్యక్తులు ప్రశ్నించారు. ఎంత సర్దిచెప్పినా వాళ్లు మాత్రం వినలేదు. తీవ్రంగా తిడుతూ సుమిత్ ను అవమానించారు. అంతటిలో ఆపకుండా తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు.
చెయిన్ లాగి రైలను ఆపించారు. అలా ఆపగానే.. సుమిత్ ను లోపలి నుండి లాక్కొని వచ్చి.. అతడి రెండు కాళ్లను కిటికీలకు కట్టేశారు. అయితే అతడిని అలా కట్టేసిన తర్వాత రైలు తిరిగి ప్రారంభమైంది. అలా రైలు కదిలి దాదాపుగా నాలుగు గంటలు ప్రయాణించింది. రైలు ఓ స్టేషన్ కు రాగానే ఆ రాక్షసులు రైలు దిగి.. కిటికీకి వేలాడుతున్న సుమిత్ ను తమ బెల్ట్ లతో చివకబాదారు. అక్కడ ఉన్న మిగిలిన ప్రయాణికులు ఏంటని నిలదీయగా..? వారు అక్కడి నుండి తప్పించుకున్నారు. అయితే దీని మీద ఆర్పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more