టీమిండియా సెమీస్ లో చోటుదక్కించుకుుంది. ఆసిస్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీని సాదించింది. భారత గడ్డపై జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత్ అద్వితీయ విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే చేధించింది. విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా జట్టును విజయ తీరాలకు చేర్చాడు
టీమిండియా లక్ష్య ఛేదనలో భాగంగా చివరి 3 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉంది. 13 రన్ రేట్ ఉంది. పిచ్ కూడా బౌలర్లకు బాగానే సహకరిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కోహ్లీ షో మొదలైంది. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఫాల్కనర్ బౌలింగ్ బంతి అందుకున్నాడు. మొదటి బంతిని డీప్ బ్యాక్ వార్డ్ స్క్వేర్ లెగ్ లో కళ్లు చెదిరే బౌండరీ కొట్టాడు కోహ్లీ. రెండో బంతి స్క్వేర్ డ్రైవ్ తో మరో ఫోర్.. మూడో బంతిని క్రీజును వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆఫ్ లో సిక్సర్ గా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతి ఒక రుగు వచ్చింది. ఆరో బంతికి ధోని డబుల్ కొల్లగొట్టాడు. ఈ ఓవర్ లో 19 పరుగులు పిండుకోవడంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. భారత్ 2 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడి ఆసీస్ పైకి వెళ్లింది.
19 ఓవర్ మొదటి బంతి కోహ్లీ భారీ షాట్ కు ప్రయత్నించగా డాట్ బాల్ అయ్యింది. స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారింది. ఈ తరుణంలో విరాట్ హ్యాట్రిక్ ఫోర్లతో మ్యాచ్ గతిని మార్చాడు. 2వ బంతిని పాయింట్ లో స్వ్కేర్ డ్రైవ్ ద్వారా ఫోర్ కొల్లగొట్టాడు. 3బంతిని ఫైన్ లెగ్ లో బౌండరీ దొరకబుచ్చుకున్నాడు. 4 బంతికి ఎక్స్ ట్రా కవర్ మీదుగా అద్భుత క్రికెటింగ్ షాట్ తో మరో ఫోర్ కొట్టాడు. 5 బంతి డాట్ కాగా.. ఆరో బంతి విరాట్ క్లాసిక్ కవర్ డ్రైవ్ తో బౌండరీని ముద్దాడింది. ఈ ఓవర్లో కోహ్లీ 16 పరుగులు చేశాడు. ఇక చివరి 6 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా. ధోని 20వ ఓవర్ మొదటి బంతిని విన్నింగ్ షాట్ గా బౌండరీకి తరలించాడు. ఈ మ్యాచ్ హీరో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఏప్రిల్ 2వ తేదీన టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more