బెంగళూరులోని మహరాణి మహిళా కళాశాలలో ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపోందించిన సై సినిమాను విద్యార్థినులు నిజంగానే ప్రదర్శించారు. విద్యార్థినులు సై చిత్రంలో మాదిరిగి ఘర్షణలకు పాల్పడ్డారు. అయితే అందులో కాలేజ్ గ్రౌండ్ కోసం అయితే. ఇక్కడ మాత్రం లెక్చరర్ వ్యవహారంగా వర్గాలుగా ఏర్పాడ్డారు. అదేంటి విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారా..? ఏంటీ ఇది నిజమే.. అతిశయోక్తిగా లేదు అంటారాా.. అలాంటిదేమీ లేదండి నిజంగా నిజమే.
ప్రఖ్యాత మహారాణి కళాశాల విద్యార్థినులు రెండు జట్లుగా విడిపోయి జుట్లు పట్టుకుని ఆ కళాశాల పరువు తీశారు. ఈ సంఘటన నగర వాసులను నివ్వెరపరిచింది. ఓ లెక్చరర్ బదిలీ విషయమై ఈ రెండు వర్గాల విద్యార్థినులు వీధిలోకి వచ్చి కొట్టుకోవడంతో పోలీసులు వచ్చి విడిపించాల్సి వచ్చింది. పరీక్షల సమయంలో చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు జుట్లుజుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాణి కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ బదిలీ విషయం పై కొన్ని రోజులుగా మహారాణి కళాశాల విద్యార్థినులు పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్ బదిలీని నిలిపేయాలని కొందరు విద్యార్థినులు డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రొఫెసర్ బదిలీ సబబేనని మరికొంత మంది విద్యార్థినులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మహారాణి కళాశాల ప్రాంగణంలో ఉన్నట్టుండి ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఇదే విషయంపై చర్చకు దిగారు. ఈ చర్చ చిలికి చిలికి గాలి వానగా మారి ఇరు విభాగాల విద్యార్థినుల మధ్య గొడవకు దారి తీసింది. పోలీసులు అడ్డుపడి వారిని విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పోలీసులు కళాశాలకు సెలవు ప్రకటించి విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more