వరల్డ్ కప్ మజాను టీమిండియాకు రుచిచూపించింది బంగ్లాదేశ్. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చివరి బాల్ వరకు అభిమానులకు, ఆటగాళ్లకు నరాలు తెగే ఉత్కంఠన నెలకొంది. బంతి బంతికి అందరికి బిపి రైజ్ అయింది. పసి కూనే అని అనుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియాకు చుక్కలు చూపించినా...ఆట మజాను అందించారు. నెట్ రన్ రేట్ పెంచుకోవాల్సిన మ్యాచ్ లో రన్ రేట్ మాట దేవుడెరుగు.. అసలు గెలవడానికే నానా కష్టాలు పడ్డారు. బాల్ బాల్ రే మారుతున్న ఈక్వెషన్స్.. గెలుపెవరిని వరిస్తుందో తెలియని టెన్షన్.. మొత్తం మీద భారత్ గెలిచింది. కాదు అదృష్టం గెలిపించింది.
మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు దూకుడుగా ఆడినట్టు కనిపించారు. ధావన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించారు. కానీ వెంటవెంటనే ఔట్ కావడంతో.. టిమిండియా డిఫెన్స్ లో పడిపోయింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ నెమ్మదిగా ఆడితే.. రైనా దూకుడుగా ఆడాడు. కానీ వీళ్లిద్దరూ కూడా వెంట వెంటనే ఔట్ అయ్యారు. మెరుపులా వచ్చిన వెంటనే సిక్స్ కొట్టిన హార్ధిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో బంగ్లాదేశ్ అద్భుతమైన ఫీల్డింగ్ కు పెవిలియన్ చేరాడు. యువరాజ్ పూర్తిగా నిరాశపర్చాడు. ధోనీ, చివరకు అశ్విన్ అండతో వికెట్ పోకుండా నిలబెట్టగలిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లు రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కు మొదట్లోనే దెబ్బ తగిలింది. మహ్మద్ మిథున్ అశ్విన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షబ్బీర్ రెహ్మాన్ అండతో ఇక్బాల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 11 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పొయిన బంగ్లాదేశ్.. రెండో వికెట్ 55 పరుగుల వద్ద కోల్పోయింది. తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. ఒక దవలో 95 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. భారత్ గెలుపు ఈజీ అనుకున్నారంతా. కానీ అక్కడే అసలు కథ మొదలైంది.
అద్భుతంగా పోరాడిన బంగ్లాదేశ్ టెయిలెండర్లు.. భారత్ కు చుక్కలు చూపించారు. చివరి 3 ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన సమయంలో సంయమనంతో ఆడి విజయం దిశగా దూసుకెళ్లారు. ఫలితంగా చివరి ఓవర్ లో విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే బంగ్లాదేశ్ చితకబాదిన పాండ్యాకు బాల్ ఇచ్చాడు కెప్టెర్ ధోనీ.. మొదటి మూడు బంతుల్లో 2 ఫోర్లు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ తర్వాతి రెండు బంతుల్లో 2 వికెట్లు పడడంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. కానీ కెప్టెన్ ధోనీ వ్యూహంలో అనుభవం లేని బంగ్లా చిక్కుకుంది. చివరకు భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠకు నైస్ కంక్లూజన్ వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more