ఏపి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ న్యూస్ ఛానల్స్ కు భలే పని కల్పించారు. అయితే వైసీపీ నాయకుల నిరసనల మధ్యే స్పీకర్ సభను కొనసాగించారు. వైసీపీ నాయకుల నిరసన మధ్య గందగోళ పరిస్థితుల్లోనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు. మధ్యలో లేచిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఆకాశానికెత్తారు. అంతకన్నా ముందు అధ్యక్షా వెనక బెంజిలో కూర్చుంటాను అంటూ అడిగి మరీ కూర్చున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ... నినాదాలు చెయ్యడంతో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెనక బెంచ్ లో కూర్చుని మాట్లాడారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులకు ఇంకితజ్ఞానం, సభ్యత లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని హెచ్చరించారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. వైసీపీ స్లోగన్స్ దెబ్బకు విష్ణుకుమార్ తాను వెనుక బెంచ్కు వెళ్లి మాట్లాడుతానని అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరారు.
ఇంతకంటే సిగ్గుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదన్నారు. ప్రభుత్వాన్ని అండగా నిలవడంతో టీడీపీ సభ్యుల కంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ అయిన విష్ణుకుమార్ రాజు చాలా దూకుడుగా వ్యవహరించారు.అనంతరం మైక్ అందుకున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రపదజాలంతో వైసీపీని విమర్శించారు. నీచ నికృష్టమైన ప్రతిపక్షం అంటూ … జగన్ను వ్యక్తిగతంగా విమర్శించబోయారు. ఇంతలోనే స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more