ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనలు కలర్ ఫుల్ గా కనిపించనున్నాయి. ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల కూడా కనిపించనున్నారు. గతంలో మాదిరిగానే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనలను జారీ చేసుకోవచ్చు. ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సహా ఇకపై ఆయా శాఖకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు కూడా ప్రకటనలలో దర్శనమియ్యనున్నారు. ఈ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మసానం సూచించింది.
ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలలో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫొటోలు కూడా పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై విచారించింది. ఇంతకుముందు ప్రభుత్వ ప్రకటనలలో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలను మాత్రమే ప్రచురించాలి తప్ప గవర్నర్, ముఖ్యమంత్రి తదితరుల ఫొటోలు వాడకూడదని ఇచ్చిన తీర్పును బెంచ్ సవరించింది.
ఈ విషయమై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరుతూ అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులు దేశ సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నాయని వాదించాయి. దీంతో విచారణను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తన తీర్పును సవరిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more