ఆసియా కప్ టోర్నమెంటులో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తున్న టీమిండియా పట్ల ఆ జట్టు కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సంతోషం వ్యక్తం చేశారు. టీ 20 మ్యాచ్ లలో తమ జట్టు అత్యంత నిలకడగా ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఏ జట్టుతోనైనా కచ్చితమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ధీమాను వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20ల్లో టీమిండియా పటిష్టతతో పాటు సమతుల్యంగా కూడా కనబడుతుందన్నాడు.
టీమిండియా జట్టును చూడండి. ఇలా ఉండటం తరచుగా జరగొచ్చని. తాము ఈ ఏడాది ఆడిన 10 టీ 20ల్లో తొమ్మిది గెలిచామని ధోని పేర్కోన్నాడు. స్వదేశంతో పాటు విదేశాలలో కూడా తాము టీ 20 మ్యాచ్ లను అడి గెలిచామన్నారు. పలు దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడి నెగ్గామన్నాడు. తాను కేవలం టీ 20 ఫార్మెట్ గురించి మాత్రమే చెబుతున్నానని, వన్డేల గురించి కాదని ధోని స్పష్టం చేశాడు. టీమిండియా జట్టులో ముగ్గురు యోగ్యమైన సీమర్లు ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు కూడా ఉన్నారని తెలిపాడు.
ఎనిమిదో స్థానం వరకూ తమ బ్యాటింగ్ పై భరోసా ఏర్పడిందని.. దాంతో మ్యాచ్ చివర్లో కొన్ని విలువైన పరుగులు కూడా జట్టుకు అదనంగా చేకూరుతాయని తెలిపాడు.ఇదే సరైన కాంబినేషన్ అనుకుంటున్నానని యూఏఈతో మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం ధోని జట్టుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో చివరి, ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో పోటీ కచ్చితంగా ఉంటుందన్నాడు. ఏ జట్టుకైనా స్వదేశీ పరిస్థితులు బాగా తెలియడం వల్ల బంగ్లాతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more