సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, సుజనా చౌదరి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్ తదితరులపైన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇంకా జరుగుతోందని ఆమె ఆరోపించారు. రాజధాని భూముల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తనకు వాచీ కూడా లేదని చెబుతున్నారని.. ఆయన చేతికి వాచీ లేదని, అలాగే రైతులకు గోచీ కూడా లేకుండా చేశారని రోజా నిప్పులు చెరిగారు. నారాయణ, నారా వారు కలిసి రాజధానిలో లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రికి సంబంధం లేకుండా భూసేకరణ ఎలా చేశారని ఆమె ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో కేవలం టీడీపీ నేతల భూములున్న చోటునే కమర్షియల్ జోన్-గా చేస్తున్నారని రోజా అన్నారు.
సాక్షి పత్రికలో వార్తలు రాగానే ఆన్ లైన్ లో రికార్డులన్నీ తొలగించారని రోజా ఆరోపించారు. మరికొందరి పేర్లు బయటకు వస్తాయనే ఆ రికార్డులు తొలగించారన్నారు. తప్పుచేయకపోతే వాటినెందుకు తొలగించారన్నారు. తము ఆస్తులు ప్రకటిస్తున్నామని లోకేష్ చెబుతున్నారని, మరి సీబీఐ విచారణ చేస్తామంటే సోనియా గాంధీ కాళ్ళెందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆస్తుల పైన ముద్రగడ పద్మనాభం చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హెరిటేజ్-లా వేల కోట్లు ఏ రైతూ ఎందుకు సంపాదించలేకపోయాడో చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఏ రైతు కూడా హెరిటేజ్ వంటి వేలాది కోట్ల ఆస్తులకు ఎందుకు ఎదగలేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more