Roja said Chandrababu Naidu must answer about allegations

Roja said chandrababu naidu must answer about allegations

Roja, chandrababu Naidu, chandrbabau, Amaravathi, Lands, Ap, Capital, Narayana, Pullarao

Roja said Chandrababu Naidu must answer about allegations. Sakshi news paper publish articles about Amaravathi lands

ITEMVIDEOS: చంద్రబాబు సమాధానం చెప్పాలి: రోజా

Posted: 03/03/2016 04:28 PM IST
Roja said chandrababu naidu must answer about allegations

సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, సుజనా చౌదరి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్ తదితరులపైన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇంకా జరుగుతోందని ఆమె ఆరోపించారు. రాజధాని భూముల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తనకు వాచీ కూడా లేదని చెబుతున్నారని.. ఆయన చేతికి వాచీ లేదని, అలాగే రైతులకు గోచీ కూడా లేకుండా చేశారని రోజా నిప్పులు చెరిగారు. నారాయణ, నారా వారు కలిసి రాజధానిలో లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రికి సంబంధం లేకుండా భూసేకరణ ఎలా చేశారని ఆమె ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో కేవలం టీడీపీ నేతల భూములున్న చోటునే కమర్షియల్ జోన్‌-గా చేస్తున్నారని రోజా అన్నారు.

సాక్షి పత్రికలో వార్తలు రాగానే ఆన్ లైన్ లో రికార్డులన్నీ తొలగించారని రోజా ఆరోపించారు. మరికొందరి పేర్లు బయటకు వస్తాయనే ఆ రికార్డులు తొలగించారన్నారు. తప్పుచేయకపోతే వాటినెందుకు తొలగించారన్నారు. తము ఆస్తులు ప్రకటిస్తున్నామని లోకేష్ చెబుతున్నారని, మరి సీబీఐ విచారణ చేస్తామంటే సోనియా గాంధీ కాళ్ళెందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆస్తుల పైన ముద్రగడ పద్మనాభం చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హెరిటేజ్‌-లా వేల కోట్లు ఏ రైతూ ఎందుకు సంపాదించలేకపోయాడో చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఏ రైతు కూడా హెరిటేజ్ వంటి వేలాది కోట్ల ఆస్తులకు ఎందుకు ఎదగలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  chandrababu Naidu  chandrbabau  Amaravathi  Lands  Ap  Capital  Narayana  Pullarao  

Other Articles