ఆసియాకప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా మూడో విజయంతో ధోనీసేన హ్యాట్రిక్ కొట్టింది. దీంతో పాటు మరో మ్యాచ్ మిగిలుండానే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకపై ఐదు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని భారత మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత శర్మ వికెట్లు కోల్పోవడంతో కాస్త కంగారు పడ్డా.. డాషింగ్ బ్యాట్స్మన్, ఛేజింగ్ కింగ్ కోహ్లీ 56రన్లతో ఇండియాను విజయ తీరాలకు చేరవేశాడు.
అంతకుముందు టాస్ నెగ్గిన ధోనీ లంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వెటరన్ పేసర్ ఆశీష్ నెహ్రా తన రెండో ఓవర్లోనే ఓపెనర్ దినేశ్ చాందిమల్ను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే బుమ్రా గుడ్ లెంగ్త్ బంతితో జయసూర్యను పెవిలియన్కు పంపాడు. ఇక రెండు ఫోర్లు కొట్టి జోరందుకున్న దిల్షాన్ను తన తొలి బంతికే పాండ్యా అవుట్ చేశాడు. కాసేపు పోరాడిన కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్నూ క్లీన్బౌల్డ్ చేసి లంకను కోలుకోలేని దె బ్బకొట్టాడు. ఈ దశలో కపుగెదెర, సిరివర్దనె జట్టును ఆదుకు నే ప్రయత్నం చేశారు. అయితే సిరివర్దనను అవుట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో షనక రనౌటయ్యాడు. ఇక బుమ్రా బౌలింగ్లో పాండ్యా పట్టిన మంచి క్యాచ్కు కపుగెదెర వెనుదిరిగాడు. అయితే క్రమంగా వికెట్లు పడగొట్టినా చివర్లో బౌలర్లు పరుగులు ఇచ్చుకున్నారు. ఆఖర్లో పెరీర వేగంగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరందించాడు
యువరాజ్ చాన్నాళ్ల తర్వాత తనలోని హిట్టర్ను మేల్కొలిపాడు. తానెదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీకి పంపిన యువీ.. హెరాత్ వేసిన 13వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. పెరీర బౌలింగ్లోనూ భారీ సిక్సర్ బాదాడు. అయితే పెరీర వేసిన 17వ ఓవర్లో బౌండ్రీ కొట్టిన యువీ తర్వాతి బంతికే హుక్ షాట్ ఆడి ఫైన్లెగ్లో కులశేఖరకు చిక్కాడు.బ్యాట్స్మన్గా మునుపటిలా రాణించలేకపోతున్న కెప్టెన్ ధోనీ కీపింగ్లో మాత్రం అదరగొడుతున్నాడు. వికెట్ల వెనుకాల చురుగ్గా కదులుతూ.. ప్రత్యర్థులను దెబ్బ కొడుతున్నాడు. ఈ మ్యాచ్లో రెండు క్యాచ్లు పట్టిన ధోనీ, ఒక రనౌట్, స్టంపౌట్ చేసి నాలుగు వికెట్లలో భాగస్వామి అయ్యా డు. ముఖ్యంగా చివర్లో భారీ షాట్లు కొడుతున్న పెరీరను మహీ స్టంపౌట్ చేసిన తీరు మ్యాచ్కే హైలెట్! 19వ ఓవర్లో అశ్విన్ వైడ్ బంతికి పెరీర క్రీజు వదిలి ముందుకెళ్లి ఆడబోగా, మహీ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ధోనీలో కాన్ఫిడెన్స్ చూసిన పెరీర అంపైర్లు చెప్పకముందే పెవిలియన్ బాట పట్టాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more