మా తాతలు నేతులు తాగారు.. కావాలంటే మా మూతులు చూడండి అంటే ఇప్పట్లో ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మాటల కన్నా చేతలకే జనం జై కొడతారు. ఏపిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా... ఇదీ ఒక ప్రభుత్వమా అంటే ఏవోవో మాటలు చెప్పారు. రాజకీయ అనుభవం ఉన్నంత మాత్రాన సరిపోదని.... ఏ పనినైనా చేసే దమ్ముండాలని తొడ గొట్టి మరీ సవాల్ చేస్తారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క దెబ్బతో ఖంగుతిన్నారు. జగన్ మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా చేయాల్సిన పని కానించేశారు.
అణువుగాని చోట అధికులమనరాదు.. అని వేమన ఎప్పుడో చెప్పాడు.. కానీ మనకు ఇప్పటికీ దాని మీద అవగాహన రావడం లేదు. పూర్తి మెజారీటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద జగన్ దుమ్మెత్తిపోశారు. అయితే బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడిగా ఆ బాధ్యత ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు పర్సనల్ లైఫ్ తో కూ డాజగన్ రాజకీయం చేశారు. ఇక జగన్ మాట్లాడిన తర్వాత వెంటనే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు మీద బండబూతులు మాట్లాడే రోజాకు కూడా చంద్రబాబు నాయుడు మంచి సమాధానమే ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టడం మాకు పెద్ద విషయం కాదు... మాతో ఇరవై మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని జగన్ గొప్పగా ప్రకటించారు. కానీ సరిగ్గా రెండు వారాలు కూడా తిరగకుండా జగన్ కు దిమ్మతిరిపోయేలా చంద్రబాబు షాకిచ్చారు. అసలు ముందు మీ సంగతి చూసుకోండి.. తర్వాత మా సంగతి చూద్దురు కానీ అన్నట్లు వ్యవహరించారు. అందులో బాగంగా తెలుగుదేశం పార్టీ లోకి వైసీపీ నాయకులను చేర్చుకుంటున్నారు సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. దాంతో వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
అసలు టిడిపి పార్టీలో ఏముందని ఆ పార్టీలో చేరుతారు అని రోజా అన్నా.. సైలైంట్ గా పని చేస్తున్న చంద్రబాబు. భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లాలో టిడిపిలో చేరుతారు అన్న వార్తలతో హడావిడిగా సమావేశం నిర్వహించారు మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలకు దిగారు. ఇక పార్టీ మీద ఆపరేషన్ ఆకర్ష్ ఉంది అని తెలియడంతో సెకండ్ క్యాడర్ నేతలతో చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కానీ అసలు వారికి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చెయ్యాల్సిన అవసరం ఏంటి అంటే మాత్రం జగన్ ఆత్మరక్షణలో పడ్డారు అందుకే చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి విమర్శలకు ప్రోత్సహిస్తున్నారు అన్నది అందరికి తెలిసిన నిజం.
ఇరవై మంది ఎమ్మెల్యేలు నా పక్షాన ఉన్నారు అని ప్రనకటించిన జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. నిన్న ఒక్క రోజే చంద్రబాబు నాయుడు సమక్షంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ సైకిలెక్కి.. తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి లాంటి కీలకనేత పార్టీని వీడటం సీమలో పార్టీకి ఎదురుదెబ్బే అని గ్రహించిన జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందుకు జగన్ మీడియా కూడా సహకరిస్తోంది. అందుకే సాక్షిలో భూమాతో సహా పలువరు ఎమ్మెల్యేల చేరిక మీద తన స్టైల్లో స్పందించింది. తన కతనంలో చంద్రబాబు 66 మంది ఎమ్మెల్యేల కోసం పైరవీ చేశారని కానీ అందులో కేవలం నలుగురు మాత్రమే దక్కారని కథనం రాసింది. అలాగే కడప, కర్నూల్ జిల్లాలో అసమ్మతి రాజుకుందని కూడా రాసింది.
వాపు చూసి జబ్బులు చరిస్తే ఇలాగే ఉంటుందని వైసీపీ అధినేత జగన్ కు ఇప్పటికైనా అర్థమైందో లేదో మరి. అయినా చంద్రబాబు నాయుడు ఎంత రాజకీయ చాణిక్యుడో జాతీయ స్థాయిలో అందరికి తెలుసు. కానీ తనకు వచ్చిన సీట్లతో రెచ్చిపోయిన జగన్ తన తరహా రాజకీయాన్ని నడిపారు. దాంతో చంద్రబాబు నాయుడు తన స్టైల్లో సైలెంట్ గా వైసీపీ నాయకులను లాగి... తెలుగుదేశం సైకిల్ ఎక్కేటట్లు చేశారు. అయినా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ పని తీరు మీద విమర్శించాల్సిన వైసీపీ చేరికలు, కూడికల మీద లెక్కలు వేసుకుంటుండంతో జగన్ కు చంద్రబాబు పక్కా ప్లాన్ తో చెక్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more