మేం దేశ భక్తులం.. మారక్తంలోనే దేశభక్తి ఉంది.. విద్యార్థులకు అండగా మేముంటాం అంటూ ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటన చూస్తుంటే నవ్వొస్తోంది. ఇక దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ అడుగుముందుకేసి.. మోదీగారికి నేను ఓ సలహా ఇస్తాను.. విద్యార్థులతో మాత్రం పెట్టుకోవద్దు అని అన్నారు. అయినా యూనివర్సిటీల్లో రాజకీయాలు చేస్తున్నది ఎవరు..? తేడాగా ప్రవర్తిస్తున్నది ఎవరు..? జవహర్ లాల్ యూనివర్సిటీలో జరిగింది ఏమిటి..? కోల్ కత్తా జాదవ్ పూర్ యూనివర్సిటిలో ఏం జరుగుతోంది..? అన్నింటికి పూర్తి విశ్లేషణ అందిస్తున్నా..
పార్లమెంట్ మీద దాడికి దిగిన ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరి తీసి చాలా కాలం అయితే అతడి వర్దంతి సందర్భంగా సాంస్రృతికి కార్యక్రమాల పేరుతో ఓ విద్యార్థి సంఘం సంతాప, సానుభూతి సభను ఏర్పాటు చేసింది. అయితే అంతకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలానే జరిగాయి. అప్జల్ గురును అమరవీరుడిగా కీర్తిస్తూ.. విద్యార్థులు నినాదాలు చేశారు. బారత్ కు స్వాతంత్రం కావాలంటూ నినాదాలు చేశారు. మాకు స్వేచ్ఛ కావాలి... కాశ్మీర్ కు స్వేఛ్చ కావాలి.. నాగాలాండ్ కు స్వేచ్ఛ కావాలి.. ఒకవేళ ఇవ్వకపోతే లాక్కుంటాం అంటూ నినదించారు. అయితే ఇలా విద్యార్థి సంఘం నాయకుడు చేసిన ప్రసంగం అప్ఘల్ గురుకు అనుకూలంగా సాగింది. దీని మీద తీవ్ర దుమారంరేగి .. అతడి మీద దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు.
ఇక జాదవ్ పూర్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఏకంగా నక్సల్స్ దాడిలో పోలీసులు చనిపొతే.. ఏకంగా సంబరాలు చేసుకున్నారని కూడా పోలీసులు గుర్తించారు. ఇక దిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అయితే అలా ర్యాలీ చేస్తున్న టైంలోనే అప్ఘల్ గురుకు అనుకూలంగా నినాదాలు చెయ్యడంతో వివాదం ముదిరింది. ఇక దిల్లీ యూనివర్సిటీలో అప్ఘల్ గురు వర్దంతి సందర్భంగా సభకు అనుమతి కోరిన, సభ కన్వీనర్ గిలానీనీ కూడా పోలీసులు అరెస్టు చేసి, దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు.
ఇదంతా నిజానికి విద్యార్థులకు సంబందించిన విషయం. వాళ్లు మేధావులు.. దేశ, విదేశ వ్యవహారాల మీద అవగాహన కలిగిన వారు.. వాళ్లు తెలిసి లేదంటే తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. లేదంటే అసలే చేసింది తప్పే కాకపోవచ్చు. కానీ రాజకీయ నాయకులు అక్కడికి ఐటెం గర్ల్స్ లాగా వెళ్లి చేసిన హంగామా ఇప్పుడు రాజకీయాలను క్యాంపస్ లలో నిర్వహిస్తుంది అనడానికి అద్దం పడుతోంది. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలకు కొన్ని సూటి ప్రశ్నలు.. వీటికి సమాధానం ఉంటే మాత్రం రాహుల్, కేజ్రీవాల్ లు తేడా కాదు అని నేను ఒప్పుకుంటాను.
* విద్యార్థులకు మద్దతుగా రాహుల్, కేజ్రీవాల్ లు బయటి నుండి మద్దతివ్వవచ్చు.. పార్లమెంట్ లో మాట్లాడవచ్చు కానీ అలా ఎందుకు చెయ్యలేదు
- ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఒకటే ఇద్దరి లక్ష్యం. కాబట్టే ఉగ్రవాదికి జై అన్నా వాళ్లకు వీళ్లు మద్దతిస్తున్నారు
* సియాచిన్ లో మన సైనికులు వీర మరణం పొందితే కనీసం ఒకరి గురించైనా కేజ్రీవాల్, రాహుల్ గాంధీలు మాట్లాడారా.,.? వారి కుటుంబ సభ్యలకు సానుభూతి, సంతాపం తెలిపారా..?
- అలా చెయ్యరు ఎందుకంటే మీడియాలో రావాలంటే అలాంటి పనులు కాకుండా వివాదాస్పద ఘటనల మీదే స్పందించాలి
* దేశ భక్తి ఉన్న రాహుల్, కేజ్రీవాల్ లు సైనికులకు గౌరవం ఇవ్వకుండా ఓ ఉగ్రవాదికి మద్దతిచ్చిన విద్యార్థికి ఎందుకు మద్దతిస్తున్నారు..?
- ఎందుకంటే రాజకీయాలు. విద్యార్థులు తమ వెంట ఉంటే ఎలాగైనా ముందు ఓటుబ్యాంకు దక్కుతుందని
* దేశం పరువు పోతోంది.. ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టకు మాయని మచ్చలు అని మాట్లాడుతున్న రాహుల్, కేజ్రీవాల్ లు ఇప్పటి దాకా దేశంలో ఎక్కడా, ఏమీ జరగలేదు అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు..?
- 2జీ స్కాంతో సహా చరిత్రలో చెరిగిపోని స్కాం హిస్టరీని క్రియేట్ చేసిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఆ మాట అనడానికి కాస్తైనా ఇంగితం ఉండాలి. ఇక కష్టాలకు భయపడి ముందే చేతులెత్తి ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కిన కేజ్రీవాల్ దేశ గౌరవం గురించి మాట్లాడటం సిగ్గు చేటు.
అన్నింటికి మించి అసలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ దేశానికి, దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు. ఉగ్రవాదులకు జిందాబాద్ అన్నా.. దేశాన్ని ముక్కలు చెయ్యాలన్నా.. ఇంకా ఏమన్నా కానీ మేము, మా అనుచర గణం మద్దతిస్తుంది అని సందేశమిస్తున్నారా..?
అయ్యా రాహుల్, కేజ్రీవాల్ గారు నా వినతి..
* విద్యార్థి చనిపోతే హుటాహుటిని యూనివర్సిటీలకు వెళ్లారు కదా.. ఎన్నడన్నా వాళ్ల హాస్టల్స్ లో ఎలాంటి వసతులు ఉన్నాయో కనుక్కున్నారా.? విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వస్తున్నాయా..? అని కనుక్కున్నారా..? తమ సమస్యలను తీర్చాలని రోజూ రొడ్డెక్కుతున్న విద్యార్థులకు మీరు ఎందుకు మద్దతివ్వరు.
* దేశం నాశనం కావాలనుకునే....ఉగ్రవాదికి మద్దతిచ్చేది విద్యార్థి అయినా దేశ న్రధాని అయితే దేశ ద్రోహే. మరి అలాంటి వాళ్లకు మీరు ఎందుకు మద్తతిస్తున్నారు.
* దేశం కోసం ప్రాణాలను విడిచిన సైనికుల గురించి మీ కంటి కనీసం ఒక్క కన్నీటి చుక్కనైనా రాల్చారా..? ముందు సైనిక వీరులకు మద్దతివ్వండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more