మేడారం జాతర నేటి నుండి ప్రారంభమవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి జాతరకు.. ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేసింది. రాష్ట్ర మంత్రులే స్వయంగా మేడారంలో ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు కోటి మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. వారికి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తోంది. మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్. భక్తులకు కల్పించిన వసతులపై ఆరా తీశారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో భక్తుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మేడారం వచ్చే భక్తులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ నెల 19 జాతర చివరి రోజు మహాఘట్టానికి సీఎం కేసీఆర్ అటెండవుతారని చెప్పారు మంత్రులు.
మేడారం జాతరకు నిరంతర బస్సు సర్వీసులను ఏర్పాటుచేసింది ఆర్టీసీ. 51 పాయింట్ల ద్వారా 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. లక్షలాది మంది భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు 11వేల మంది సిబ్బందిని పురమాయించింది. తాత్కాలిక బస్ స్టేషన్ లను అమ్మవారి గద్దెల సమీపంలో ఏర్పాటు చేశామన్నారు ఆర్టీసీ జేఎండీ జి.వి.రమణారావు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది సర్కార్. సౌకర్యాల కల్పనలో రాజీపడే సమస్య లేదంటోంది. పోలీసులు ఉన్నతాధికారులు కూడా సెక్యూరిటీని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు.
నేటి నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుండటంతో… సమ్మక్క, సారలమ్మకు సారె పంపారు నల్లమల చెంచులు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ అడవుల్లో కొలువుదీరిన భ్రమరాంబ, మల్లన్న సన్నిధిలో మహిళలు సారెను సిద్ధం చేశారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆదివాసీలు. నల్లమలలో ఉంటున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చెంచులు ఈ ఘట్టంలో పాలుపంచుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more