గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు మొరాయించాయి. హయాత్ నగర్, వనస్థలిపురం, రామాంతపూర్, కూకట్ పల్లి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మీగూడలో, హయత్ నగర్ సిద్దార్థ్ స్కూల్ లో, కొండాపూర్ లోని 33, 34, 35 పోలింగ్ కేంద్రాల్లో, కేపీహెచ్ బీ కాలనీలో 5,6,7,8,9,10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మెరాయించినట్టు తెలుస్తోంది. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, అందుకే పోలింగ్ ఆలస్యం అయిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తాము నిపుణులను పంపామని, ఈవీఎంలను సరి చేస్తామన్నారు. ఒకవేళ ఆ ఈవీఎంలు పని చేయకుంటే వాటిని మార్చేస్తామని వెల్లడించారు.
మరో పక్క గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అత్యాధునికమైన ఇంటిగ్రేటేడ్ ఈ-సర్వేలేన్స్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని, బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు కమెండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 811 సమస్యాత్మక, 286 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా సోమాజిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ టోపీలు, కరపత్రాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమాజిగూడలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more