Hero Nagarjuna and Maa President Rajendra Prasad utilities their vote

Hero nagarjuna and maa president rajendra prasad utilities their vote

GHMC, Nagarjuna, Rajendra Prasad, Vote

Hero Nagarjuna and Maa President Rajendra Prasad utilities their vote. Rajaendra Prasad call to vote in this GHMC Elections.

ఓటు వేసిన రాజేంద్రప్రసాద్, నాగార్జున

Posted: 02/02/2016 11:09 AM IST
Hero nagarjuna and maa president rajendra prasad utilities their vote

గ్రేటర్ పోలింగ్ నిదానంగా సాగుతోంది. ఓటింగ్ ప్రారంభం అయ్యి మూడు గంటలు అవుతున్నా.. 11.2శాతం మాత్రమే నమోదు అయ్యింది. అత్యధికంగా కాప్రా, ఎల్బీనగర్, ఉప్పల్ డివిజన్లలో 16శాతం వరకు నమోదు అయ్యింది. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్లలో అతి తక్కువ పోలింగ్ నమోదు అయ్యింది. ఈ రెండు డివిజన్లలో ఇప్పటి వరకు 6శాతం మాత్రమే ఓటింగ్ పోలైంది. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు వస్తుందని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు గవర్నర్ నరసింహన్. ఓటు వేయటం బాధ్యత అన్నారు. ఓటు వేయటం ద్వారా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారన్నారు. మీకు ప్రశ్నించే హక్కు ఉండాలంటే.. ఓటు వేయాలని సూచించారు గవర్నర్.

హైదరాబాదీ యూత్ నిద్రలేవాలని.. బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటు వేయటానికి సమయం ఉంది.. యువత పోలింగ్ బూత్ ల దగ్గర రావాలని పిలుపునిచ్చారాయన. కేపీహెచ్ బీ 7వ ఫేజ్ లో ఓటు వేశారాయన. జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు హీరో నాగార్జున, అమల. అఖిల్ కు ఓటు లేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Nagarjuna  Rajendra Prasad  Vote  

Other Articles