మంత్రాలకు చింతకాయలు రాలవన్న విషయం కాంగ్రెస్ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి.. ఎట్టకేలకు అర్థమైంది. పదేళ్ల అధికారంలో ఏనాడు సుదీర్ఘ ఉపన్యాసాలు, ప్రసంగాల జోలికి వెళ్లని రాహుల్.. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నారు. అంతేకాదు అధికారంలో వున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా ఆయన ఈ విషయాన్ని సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగాలతో ప్రజలను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారని, అయితే మంత్రాలకు చింతకాయలు రాలవని, అదే విధంగా మోడీ ప్రసంగాలతో దేశంలోని రోడ్లు శుభ్రం కావని రాహుల్ ఎద్దేవా చేస్తున్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీజేపీ సర్కారుపై రాహుల్ గాంధీ పదునైన విమర్శలను గుప్పించారు. కేవలం ప్రసంగాలతోనే రోడ్లు శుభ్రం కావని ఆయన కాస్తంత ఘాటు విమర్శలే చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వంగానే ముందుకెళుతోందని ఆయన విమర్శించారు. మాటలతోనే పనికాదని కూడా ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పేరిట మోదీ ఇచ్చిన పిలుపుతోనే రోడ్లు శుభ్రం కావని, ముంబైలోని రోడ్లపై ఇంకా టన్నుల కొద్దీ చెత్త కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ తరహా పాలనతో ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం పట్ల నమ్మకం కరిగిపోతోందని కూడా ఆయన పేర్కొన్నారు.
స్టార్టప్, అసహనం రెండు కలసి సాగలేవని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశంలో స్టార్టప్ ల మంత్రాన్ని బీజేపీ సర్కారు పఠిస్తుంటే, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కఠిన వైఖరితో సాగుతోందని ఆయన ఆరోపించారు. అసహన విధానాలను పెంచిపోషిస్తుందని విమర్శించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ నగరంలోని జుహూ-విలేపార్లే పరిధిలోని ‘నర్సీ మాంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్’ విద్యార్థులతో భేటీ అయ్యారు.
బీజేపీ ద్వంద్వ వైఖరితో పాలన సాగిస్తోందని రాహుల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. స్టార్టప్, అసహనం... రెండూ చేతులు కలిపి ముందుకు పయనించలేవని ఆయన తేల్చిచెప్పారు. స్వేచ్ఛ ఉన్నప్పుడే స్టార్టప్ లు వృద్ధి చెందుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక బీజేపీ సర్కారు దేశ ప్రజలను వర్గాలు చీలుస్తోందని విమర్శించారు. దేశ ప్రజలను బీజేపీ సర్కారు హిందువులు, ముస్లింలు అంటూ విభజిస్తోందని దుయ్యబట్టారు.
అయితే తాము మాత్రం దేశ ప్రజల మధ్య విభజన రేఖలను గీయడం లేదన్నారు. ఇదే తమకూ, బీజేపీకి ఉన్న తేడా అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఓ విద్యార్థి జనరల్ సేల్స్ టాక్స్ (జీఎస్టీ)పై రాహుల్ ను ప్రశ్నించగ, ప్రజలపై అధిక భారం పడకూడదనే తాము జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. జీఎస్టీ బిల్లుతో ప్రజలపై రెండు నుంచి రెండున్నర శాతం మేర అధిక భారం పడుతుందని రాహుల్ చెప్పారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల అకాశాన్ని అంటుతున్న తరుణంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడం తమకు ఇష్టంలేదన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more