సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబే అడ్డుపడుతున్నారని.. ఈ నేపథ్యంలో తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హామీలను నెరవేర్చడానికి తాను చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ ఆయన ఏదో ఒక మెలిక పెట్టి వెనక్కులాగుతున్నారని రాయపాటి తన మనస్సులోని మాటలను ఉండబట్టలేక బయటపెట్టారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరయిన ఆయన తన గుండెలోతుల్లో వున్న భాధను ఎట్టకేలకు బయటపెట్టారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ... మాచర్ల, వినుకొండ, గురజాల గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించేందుకు రూ.1120 కోట్లతో వాటర్గ్రిడ్ ఏర్పాటుకు పూనుకున్నానని, ఈ విషయాన్ని యుఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే నిధులు లేవన్నారని తెలిపారు.
కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమకు, ఢిల్లీకి అంటీముట్టనట్లుగా ఉందని, అక్కడ తాను గట్టిగా అడిగితే బాబు తిడుతున్నారని (దొబ్బేస్తున్నారని) వాపోయారు. దీంతో అప్పు కోసం బ్యాంకర్లతో మాట్లాడానని, పది నుంచి పదిహేను సంవత్సరాల్లో తీసుకున్న అప్పును 9.6 శాతం వడ్డీతో తిరిగి చెల్లించేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నారని, అయితే చంద్రబాబు 8.5శాతం అయితే ఓకే అంటున్నారని చెప్పారు.
గుంటూరు రైల్వేజోన్ కోసం ఒత్తిడి చేద్దామంటే సీఎం కోప్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య తాను సీపీఐ వాళ్లకు భోజనాలు పెడితే, ఎందుకు పెట్టావని పార్టీ వాళ్లు ప్రశ్నించారని చెప్పారు. ‘ఇక్కడ నేను ఇమడలేకపోతున్నాను.. రత్తయ్య గారూ ఇన్నాళ్లు మీరెలా ఇమిడి ఉండిపోయారు..’ అని అదే వేదికపై ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను ప్రశ్నించారు. చంద్రబాబు తనను తీసుకెళ్లి అడవుల్లో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే తన వ్యాఖ్యలన్నీ ‘ఆఫ్ ది రికార్డ్’ అని, రాయవద్దని బహిరంగసభ చివర్లో రాయపాటి చెప్పడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more