అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే రోజుతో పోల్చుకుంటే హస్తినలో వాయుకాలుష్యం దాదాపు 300శాతం తగ్గిందని తాజాగా తేలింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదించిన ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఈ విధానం ఢిల్లీలో అమల్లోకి వచ్చింది.
అయితే, సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడం.. ఉద్యోగులు పెద్దసంఖ్యలో వాహనాలతో రోడ్ల మీదకు రానుండటంతో సోమవారం నుంచి 'సరి-బేసి' విధానం మీద అసలు పరీక్ష మొదలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమల్లో భాగంగా సైకిల్ మీద తన కార్యాలయానికి వెళ్లి అందరి దృష్టి ఆకర్షించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'సరి-బేసి' విధానం అమలు విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ విధానం అమలు వల్ల శనివారం ఒక్కరోజు 300శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపారు. 15 రోజులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తే.. నగరంలో కాలుష్యంపై ప్రజలకు చైతన్యం పెరిగి.. ప్రత్యామ్నాయా రవాణా సదుపాయాన్ని కూడా వారు వినియోగించుకునే అవకాశముందని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more