కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రధాని నరేంద్రమోడీలపై అస్సాం ఎమ్మెల్యే నిలమోని సేస్ డేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో గౌహతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రధాని మోదీ రెండవ భార్య అంటూ ప్రజల్లో అరోపణలు వస్తున్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సెన్ డేకా తన తప్పును తెలుసుకుని ఆ తరువాత క్షమాపణలు చెప్పారు. అంతేకాదు తన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా తెలిపారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఎమ్మెల్యే డేకా ఒక్కడే కాదు ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కూడా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ అందోళన కార్యక్రమాలకు దిగింది.
దీంతో గౌహతిలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ అలజడి కొందరు గాయపడ్డారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు పరిస్థితి అదుపు తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్కు దిగారు. జీఎస్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. బీజేపీ కార్యకర్తలు తమపై రాళ్లు రువ్వారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. అయితే తాము మాత్రం నిమ్మకుండిపోయామన్నారు
కాగా, ఈ ఉద్రిక్తతో బిజేపీ కార్యర్తలు పలు ప్రజా, ప్రైవేటు అస్తులను ధ్వంసం చేశారు. దీంతో పాటు 27 మంది కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడగా, వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా వుంది. విధ్వంసానికి దిగిన బీజేపీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే సేన్ డేకా వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తీవ్రంగా తప్పుపట్టారు. అస్సాంలో సోమవారం పర్యటించిన స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. అసోంలో మహిళలకు ఏ మాత్రం గౌరవం లభిస్తుందో డేకా వ్యాఖ్యలే దర్పణం పడుతున్నాయని, ఇందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అమె అన్నారు. అయితే నోరుజారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డేకా.. తన తప్పుకు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా బీజేపి శ్రేణులు ఎందుకు అందోళనకు దిగుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more