జనం డిసెంబర్ 31ఏర్పాట్లలో అందరూ ముందు నుండి తలమునకలై ఉన్నారు. అయితే పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు. కాని, ఆ ఏర్పాట్లు వారి కోసం కాదు. తాగి డ్రైవ్ చేసే మందుబాబుల పనిపట్టటానికి. మామూలు రోజుల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం పోలీసులకు ఓ సవాలు. ఇక థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు ఎలా వుంటుంది? తాగి బండి నడిపే మందుబాబులను నియంత్రించటం కాస్త కష్టమే. అందుకే హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.
డిసెంబర్ 31 నాడు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని ఫ్లై ఓవర్లపై వాహనాల రాకపోకలు నిషేదించనున్నారు.హూస్సేన్ సాగర్, నక్లెస్ రోడ్డు చుట్టు పక్కల కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలిపే PVNఎక్స్ప్రెస్ వేను కూడా మూసివేయనున్నారు. తాగి బండి నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. ముందు వాహనాన్ని సీజ్ చేస్తారు. తరువాత కౌన్సెలింగ్ చేసి కోర్టుకు తీసుకుపోతారు. చాలా కేసుల్లో ఫైన్తో పాటు జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. రూల్స్ అతిక్రమించే వాళ్ల పట్ల చూసీచూడనట్టుగా వ్యవహరిస్తే మళ్లీ మళ్లీ అదే తప్పుచేస్తారని పోలీసులు అంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి పోలీసుల దగ్గర పూర్తి సమాచారం వుంది. ఒక సారి పట్టుబడ్డ వారు మళ్లీ దొరికిపోతే వారికి శిక్ష పెంచాలని పోలీసులు రికమండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కేసుల్లో జైలు శిక్షలు పడుతున్నాయి. నాలుగైదేళ్ల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మందుబాబుల్లో ఏటేటా మార్పు కనిపిస్తోంది. 2011లో సిటీ పోలీసులు 56వేల 386 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు. అందులో ఆరువేల 502 కేసుల్లో జైలు శిక్షలు పడ్డాయి. ఈ ఏడాది 15వేల 13 మంది పట్టుబడగా 2వేల 672 మందిని జైలుకు పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more