ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలను ముష్కర మూకలు టార్గెట్ చేశాయా..? అందుకోసం ఇప్పటికే రెక్కీ సైతం నిర్వహించాయా? ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. తిరుమలపై గురిపెట్టిన ముంబైకి చెందిన ఓ ఉగ్రవాద సంస్థ తమిళనాడుకు చెందిన రామచంద్రన్ అనే వ్యక్తి ద్వారా రెక్కీ చేయించింది. రైలు బోగీల దహనం కేసులో ఒడిశా పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన నిఘా వర్గాలు.. రామచంద్రన్ రెక్కీ చేసిన అంశాన్ని నిర్ధారించాయి కూడా. దీంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు తిరుమలతో పాటు అన్ని పుణ్యక్షేత్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సుభాష్ రామచంద్రన్ (30) చెన్నైకి వలస వచ్చి అక్కడ ఓ టీస్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు. అది లాభసాటిగా లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు వెళ్లి.. హోటళ్లలో పనిచేశాడు. 2013లో ముంబైలో స్థిరపడగా, అక్కడ రియాజ్ అనే వ్యక్తితో రామచంద్రన్కు పరిచయం ఏర్పడింది. అతనితోపాటు ఉత్తమ్, గోపాల్, అషప్ర్ కశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి అప్పుడప్పుడు వచ్చి రామచంద్రన్ను కలుస్తుండేవారు. ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వీరంతా గుర్తు తెలియని రసాయనంతో రైళ్లలో మంటలు రేపడానికి కుట్రపన్నారు. తిరుమలనూ టార్గెట్ చేసుకున్నారు. తాము వినియోగించే రసాయనాలను ప్రయోగించి చూడడానికి, తిరుమలలో రెక్కీ చేయడానికి రామచంద్రన్తో ఒప్పందం కుదుర్చుకుని అతడి అకౌంట్ లోకి రూ. 3 లక్షలు డిపాజిట్ సైతం చేశారు.
పూరీ రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన రైల్వే పోలీసులు అదే రోజు రామచంద్రన్ను పట్టుకున్నారు. అతడిని విచారించగా... అసలు విషయం బయటపడింది. దీంతో ఒడిశా ప్రభుత్వం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు.. రామచంద్రన్ను విచారించగా తిరుమలలో రెక్కీ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాలను తిరుమల నిఘావర్గాలు కూడా నిర్థారించాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయ.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more