నూతన సంవత్సరంలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఆయా పార్టీలు మేనిఫెస్టోలను సిద్ధం చేసే పనిలో నిమగ్న మయ్యాయి. ఈ ఎన్నికల్లో తాము ప్రత్యేకంగా మేనిఫెస్టోలను తయారు చేసి ప్రజల ముందుకు వెళ్తామని ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తెరాసా, కాంగ్రెస్, తెదేపాలు ప్రకటించాయి. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను తన భుజ స్కంధాలపై వేసుకున్న పంచాయతీ రాజ్, ఐటీ శాఖమంత్రి కెటీ రామారావు ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను తమ పార్టీ సిద్ధం చేస్తోందని ప్రకటించారు.
అధికార పార్టీ తెరాసా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు చెరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది. నగరానికి చెందిన మంత్రులతో పాటు కేటీఆర్ నగరంలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. 15 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు ఎన్నికల ప్రణాళికలో ఇవ్వని హామీలను సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ సైతం ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు సమాయత్తమైంది. మరోవైపు తెదేపా కూడా ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది. ఇందులో పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ సభ్యులుగా ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గ్రేటర్ ఎన్నికలపై పార్టీకి చెందిన సీనియర్లతో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటారని ప్రకటించారు. ఈ నెల 27న నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. ఈలోపు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, 150 డివిజన్ల అధ్యక్షులు, పరిశీలకులతో సమావేశం కావాలని లోకేష్ నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more