యావత్ ప్రపంచ మెచ్చిన మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, ఏపీజే అబ్దుల్ కలాం. ఆయనకు రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమే అన్నట్లుగా వుండేది తప్ప.. ఆయన పదవిలో వున్నా లేకున్నా.. నిత్యం సేవా కార్యక్రమాలలో పాల్గోంటూ యువతను కలలు కనండి, వాటిని నెరవేర్చుకోండి అంటూ పిలుపునిచ్చి జాగృత పర్చిన చైతన్యస్పూర్తి ప్రధాత ఆయన. అలాంటిది ఆయన గతించి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ప్రపంచ దేశాల నేతలు ఆయనకు ప్రఘాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచమంతా గుర్తించినా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు మాత్రం గుర్తు లేనట్టుంది.
అందకనే తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలని దివంగత రాష్ట్రపతి కలాంకు బీఎస్ఎన్ఎల్ నోటీసు జారీ చేసింది. అంతేకాక బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన చరాస్తులను జప్తు చేయాలని కూడా తన క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ, ఆ సంస్థకు కలాం బకాయిపడ్డ మొత్తమెంతో తెలుసా?... కేవలం రూ.1029 మాత్రమే. అది కూడా తిరువనంతపురం పర్యటనలో భాగంగా ఆయన కేరళ రాజ్ భవన్ లో రెండు రోజుల పాటు బస చేసిన సందర్భానికి సంబంధించిన బిల్లట. ఇక ఏ తేదీతో నోటీసు జారీ అయ్యిందో తెలుసా?... 18, నవంబరు, 2015 తేదీతో..అంటే కలాం చనిపోయిన నాలుగు నెలలకన్నమాట. బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసుల విషయం తెలుసుకున్న కేరళ రాజ్ భవన్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. దీనిపై మరింత చర్చ జరగకముందే, సదరు బిల్లును తాను చెల్లిస్తానంటూ కేరళ రాజ్ భవన్ ప్రకటించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more