ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "పార్లమెంట్ ఇప్పుడు పనిచేస్తోంది. ఇది శుభవార్తే. ఆ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోదీది కాదు, అన్ని రాజకీయ పార్టీలది" అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో రాష్టాలూ కీలకభూమిక పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను రాష్ట్రాలు ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు ఢిల్లీలోనే నిర్ణయించేవారని, తాము ఈ పరిస్థితిని మార్చామని చెప్పారు. శుక్రవారం హిందూస్థాన్ టైమ్స లీడర్ షిమ్ సమిట్ లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పుడు మనదేశం అభివృద్ధి ఆగలేదని తెలిపారు.
సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. దేశంలో ఇప్పటికి 18 వేల గ్రామాలకు కరెంట్ లేదని తెలిపారు. గత ప్రభుత్వాలు పనిచేయలేదని తాను చెప్పడం లేదని, 1000 రోజుల్లో గ్రామాలన్నింటికీ కరెంట్ అందిస్తామని హామీయిచ్చారు. కాగా, ఈ వారం ప్రారంభంలో వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దేశంలో అసహనం అంశాలపై పార్లమెంటులో వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లులను ఎలాగైనా ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని భావిస్తున్న కేంద్రం, ఇప్పటికే పలు విపక్ష పార్టీలతో చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను ప్రత్యేకంగా టీ పార్టీకి అహ్వానించిన మోదీ వారితో జీఎస్టీ బిల్లుపై చర్చించారు. మరి అన్ని సక్రమంగా సాగి ఆ బిల్లి పాస్ అవుతుందా..? లేదా..? అన్నది సమావేశాలు ముగిసేలోగా తేలిపోతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more