తెలుగు చిత్రసీమ రారాజుగా వెలుగోందిన మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన ఒక వార్త ఆయన అభిమానులను విస్మయానికి గురిచేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే వున్న మెగా ఫాన్స్ ఈ షాకింగ్ న్యూస్ తెలుసా.. లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల చిరంజీవి ఏదో పనిపై బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్ళి.. తిరిగి వస్తుండగా, ఆయనను కొందరు యువకులు వెంబడించారు.
చిరంజీవి తాజ్ కృష్ణ నుండి తిరిగి వస్తుండగా కొందరు యువకులు తప్పతాగి.. ద్విచక్రవాహనాలపై ఆయన కారును వెంబడించారట. దాదాపు తాజ్ కృష్ణ నుండి జూబ్లీహిల్స్ లోని చిరంజీవీ బ్లడ్ బ్యాంక్ వరకు ఆ మందుబాబులు చిరు కారుని వెంబడించినట్టు సమాచారం. ఇంతకీ వారెవరు..? చిరంజీవి వెంట ఎందుకు పడ్డారు.? అన్న సందేహం మీకు కలుగుతోందా..? తప్పతాగిన కొందరు యువకులు తన కారును వెంబడిస్తున్నారన్న విషయం తెలుసుకున్న చిరంజీవి.. తనను ఎందుకు ఫాలో చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారట.
ఆ యువకులు ఎందుకు వెంబడించారు,? వారి పూర్తి వివరాలను తెలుసుకోమని చిరంజీవి కూడా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి చెప్పినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రవ్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని ప్రగల్భాలు పలుకుతున్న పోలీసులు బాస్ లు కూడా ఈ ఘటనపై అంతే వేగంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా రాత్రి సమయాల్లో తాగి వాహనాలను నడిపితే.. పట్టుకుని భారీగా జరిమానాలు విధించే పోలీసులు.. ఈ ఘటన విషయంలో సమాధానం చెప్పాల్సి వుంది. రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి హోదా, మరోవైపు టాప్ సెలబ్రిటీకే రోడ్డు మీద భధ్రత కరువైతే.. ఇక సామాన్యులకు భద్రతను ఎలా కల్పిస్తారన్న విషయాన్ని పోలీసులు వివరించాల్సిన అవసరం వుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more