రోడ్డు ప్రమాదానికి గురై, తల పగలి రక్తమోడుతున్న మహిళ.. టూ వీలర్ నడుపుతున్న ఆమె కుమారునికి పెద్దగా గాయలేమీ తగలలేదు. కానీ షాకింగ్లో ఎటూ పాలుపోని స్థితి అతనిది! ఇంతలో ఆ వైపుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆ మహిళను ఆస్పత్రికి చేర్చాడు! తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం దగ్గరుండి మరో ఆస్పత్రికి మార్పించాడు! ఆ వ్యక్తి ఎవరో కాదు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, ఎంపీ అభిజిత్ ముఖర్జీ! పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన బాధితురాలి పట్ల అభిజిత్ ముఖర్జీ ప్రదర్శించిన మానవత్వం, సమయస్ఫూర్తి ఫలితంగా ఆమెకు పెనుప్రమాదం తప్పింది.
సుమితాపాల్ అనే నడివయస్కురాలు తన కుమారుడు ఆర్ఘ్యతో కలిసి బుర్ద్వాన్ నుంచి బైక్పై గుస్కారలోని గుడికి వెళుతున్నవేళ మరో టూ వీలర్ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సుమితాపాల్ తలకు పెద్ద గాయమై, క్షణాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంతలో ఆవైపుగా వెళుతున్న అభిజిత్ ముఖర్జీ తన వాహనాన్ని ఆపి పరిస్థితి చూసి చలించిపోయారు! బాధితురాలిని హుటాహుటిన తన వాహనంలో ఎక్కించుకొని గుస్కారాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ అస్పత్రి వైద్యుల సూచన మేరకు బుర్ద్వాన్లో మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
ఇందు కోసం అభిజిత దగ్గరుండి ప్రత్యేకంగా అంబులెన్స్ను ఏర్పాటు చేయించారు. అంతేకాదు.. ఖర్చుల కోసం బాధితురాలి కుమారుడు ఆర్ఘ్యకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. అభిజిత్ అంతటితో ఊరుకోలేదు.. జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్రా మోహన్కు ఫోన్ చేసి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ‘‘అభిజిత్ బాబు గనక అక్కడ లేకుంటే, ఏం జరిగేదో, తలచుకుంటేనే భయంగా ఉంది. అమ్మకు చికిత్స కచ్ఛితంగా ఆలస్యమయ్యేదే’’ అని ఆర్ఘ్య కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more