ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్నో ఉద్యమాలు చేసినా.. జరగాల్సిన అన్యాయాలు జరిగిపోతున్నాయి. ‘వాటిని అరికట్టండి.. లేకపోతే ప్రాణాలు బలవుతాయి’ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని తట్టిమరీ నిద్రలేపినా.. ఏమాత్రం ఫలితం లేకుండాపోతోంది. ఇంకా రానురాను దారుణాలు వెలుగుచూస్తున్నాయే తప్ప.. తగ్గడం లేదు. అలాంటి దారుణాల్లో ‘ర్యాగింగ్’ భూతం ఒకటి. ఇటీవల కాలంలో పెచ్చుమీరిపోతున్న ఈ భూతానికి విద్యార్థులు బలవుతున్నారు. తమ పైశాచికానందం కోసం సీనియర్లు చేస్తున్న ఆగడాలను తట్టుకోలేకపోతున్న జూనియర్లు.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలji ఈ ర్యాగింగ్ పై ఫిర్యాదులు అందినప్పటికీ.. వారు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో చావే శరణ్యమని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రముఖ కాలేజీల్లో కొందరు విద్యార్థులు ఈ ర్యాగింగ్ భూతానికి బలవ్వగా.. తాజాగా మరో తెలుగు విద్యార్థి తమిళనాడులోని ప్రతిష్టాత్మక ‘సత్యభామ’ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన వెంకటకృష్ణ అనే విద్యార్థి తమిళనాడు రాజధాని చెన్నైలోని సత్యభామ వర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ప్రస్తుతం బీటెక్ సెకండియర్ చదువుతున్న వెంకటకృష్ణపై అక్కడ సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ ర్యాగింగ్ లో భాగంగా అతని దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడంతోపాటు భౌతిక దాడులకు కూడా దిగారు. ఈ క్రమంలో గతంలోనే తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి.. ర్యాగింగ్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుండా దాచేశాడు. అయితే.. ఇటీవల సీనియర్ల వేధింపులు మరింత అధికమయ్యాయి. గతంలోకంటే ఎక్కువగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటకృష్ణ.. ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. గురువారం సాయంత్రం కళాశాలలో తాను ఎదుర్కొన్న వేధింపులను 8 పేజీల సూసైడ్ నోట్ లో రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన అతని తల్లిదండ్రులు.. సూసైడ్ నోట్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దీపావళి సెలవుల కోసం తమ వద్దకు వచ్చిన వెంకటకృష్ణ పండుగను బాగానే చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులకు అందజేసిన అతని తల్లిదండ్రులు.. ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more