చింటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోలేదు

Chintu parents condemn the gossips about their suicide

Chittoor mayor, Chittoor, mayor Anuradha, Anuradha Murder, Murder in chittoor, చిత్తూరు మేయర్, చిత్తూరు మేయర్ అనురాధ, అనురాధ, అనురాధ హత్య, చిత్తూరులో హత్య, అనురాధ దంపతుల హత్య

చిత్తూరు మేయర్ దంపుతుల హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న చింటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తలను వారు ఖండించారు. తాము క్షేమంగానే ఉన్నట్లు వెల్లడించారు.

చింటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోలేదు

Posted: 11/19/2015 06:02 PM IST
Chintu parents condemn the gossips about their suicide

చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యోదంతం తెలుగు రాష్ట్రల్లో తీవ్ర కలకలం రేపింది. మేయర్ ను కార్పోరేషన్ కార్యలయంలోనే దుండగులు హత్య చెయ్యడం తీవ్ర సంచలనం రేపింది. అయితే మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ ల మీద గుర్తు తెలియని దుండగులు తుపాకీతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనురాధ, మోహన్ ల మృతి తర్వాత వాళ్ల సన్నిహితుడు చింటు మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చింటుకు , మేయర్ దంపతులకు మనస్పర్థలు వచ్చి.. చివరకు హత్య దాకా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు చింటు కోసం గాలింపు చేపట్టారు అయితే తాజాగా చింటు తల్లి దండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

తాము ఆత్మహత్య చేసుకోలేదని... ఎవరో కావాలనే పుకార్లు సృష్టించారని చింటూ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు తెలిపారు. మేయర్‌ దంపతుల హత్యతో తమ కుమారుడికి సంబంధం లేదన్నారు. తమ కుమారుడిని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటి దగ్గర రక్షణ లేదని అందకే పోలీసులను ఆశ్రయించామన్నారు. మేయర్ దంపతుల హత్య అనంతరం తమ ఆస్తులను ధ్వంసం చేశారని చింటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.హత్య అనంతరం ఐదుగురు నిందితుల్లో ముగ్గరు లొంగిపోగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles