చిత్తూరు మేయర్ అనురాధ హత్యకేసులో ఇద్దరు దుండగులు లొంగిపోయారు. హత్య జరిగిన వెంటనే దుండగులు చిత్తూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన తర్వాత.. తామే కాల్పులు జరిపామంటూ ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. అయితే ఈ వార్తలను మాత్రం పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. దుండగుల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కాగా లోంగిపోయిన వారు రెడ్డి, వెంకటేష్ లుగా సమాచారం. మూడో వ్యక్తి కోర్టులో లోంగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్కుమార్, క్రైమ్ బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు తప్పించుకోకుండా వుండేందుకు జిల్లాలోని చెక్పోస్టులను అప్రమత్తం చేశారు.
Also Read : రెక్కీ నిర్వహించి.. పక్కా పథకంతో అనురాధ దంపతుల హత్య..?
చిత్తూరు మేయర్ అనురాధ దంపతులపై జరిగిన దాడి ఫాక్షనిస్టు హత్యేగా టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కోన్నారు. కఠారి దంపతులపై కర్ణాటకకు చెందిన వ్యక్తులు దాడి చేశారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ దాడి చిత్తూరు ఫ్యాక్షనిస్టుల పనేనని ఆయన తేల్చిచెప్పారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులు కఠారి దంపతులపై దాడి చేయాల్సిన అవసరమేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీలో కష్టపడే తత్వమున్న కార్యకర్తగా అనురాధ పేరు తెచ్చుకున్నారని, ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావుపై ఎనలేని గౌరవమున్న కఠారి దంపతులు పార్టీకి నమ్మిన బంటులని గాలి పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more