వరంగల్ ఉప ఎన్నికల మీద అన్నీ పార్టీలు దృష్టిసారించాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఇప్పటికే మంత్రలు, ముఖ్య నేతలు పర్యటనల మీద పర్యటనలు చేస్తూనే ఉన్నారు. దాంతో బిజెపి, టిడిపి అభ్యర్థి గెలుపు కోసం బిజెపి పార్టీ నాయకులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ వరంగల్ ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు.
అధికార పార్టీ టార్గెట్ గా అస్త్రాలు సంధిస్తున్నారు. మాటిమాటికి ఉప ఎన్నికలు తేవడం కెసిఆర్ కు అలవాటే అని కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్ రాజ్ గంగారం అహిర్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే...వరంగల్ ను తెలంగాణ రెండో రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: వరంగల్ వార్ వన్ సైడ్: ఎంపీ కవిత
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి హన్స్ రాజ్ వెల్లడించారు. ఇంటికో ఉద్యోగమన్నమాట దేవుడెరుగు... కేసీఆర్ ఇంట్లో మాత్రం ముగ్గురికి మంత్రి కొలువులు వచ్చాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హామీలను నెరవేర్చలేని టీఆర్ ఎస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ శక్తివంతమైన పార్టీలన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని ఒప్పుకుంటే కేంద్రం ఇవ్వడానికి సిద్దంగా ఉందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. టీఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న బీజేపీ, టీడీపీ నేతలు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే రాష్ట్ర మంత్రులందరూ వరంగల్లోనే ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more