మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో పోలీసులు ఓ కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో ఏ4 నిందితురాలిగా ఉన్న అనిల్ రెండో భార్య సనను రిమాండ్ కు తరలించిన పోలీసులు.. విచారణలో భాగంగా ఆమె నుంచి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రాబట్టగలిగారు. సనతో పరిచయం ఏర్పడకముందు అనిల్ తన భార్య సారికను చాలా బాగా చూసుకున్నాడని, కానీ ఆమెతో పరిచయం అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తేలింది. అంతకుముందు.. సనతో అనిల్ కు ఎలా పరిచయమైందన్న కోణాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు.
కాజీపేటలోని ఫాతిమానగర్ బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్న సనకు అనిల్ తో తొలుత ఓ మిస్డ్ కాల్ తోనే పరిచమయమైందట. అంతకుముందు వ్యక్తిగతంగా ఏ సంబంధంలేని వీరిని ఆ మిస్డ్-కాల్ పరిచయం చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అనంతరం పెళ్లిగా రూపాంతరం చెందింది. పెళ్లి చేసుకున్న తర్వాత అనిల్, సన తమ మకాంను సికింద్రాబాదుకు మార్చారు. అక్కడ అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే... తొలి సంతానం కలిగే దాకా అనిల్ సిరిసిల్ల రాజయ్య కుమారుడని కానీ, అతడికి అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం కానీ సనకు తెలియదట. తొలి కాన్పు తర్వాత విషయం తెలుసుకున్న సన తన భర్త అనిల్ ను నిలదీసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
ఇక అనిల్ రెండో పెళ్ళి విషయం బట్టయలు కావడంతో తరువాతి కాలంలో సారికతోనూ సన పలుమార్లు గొడవ పడిందని పోలీసులు చెబుతున్నారు. చివరకు అనిల్ తో విడిపోయేందుకు సిరిసిల్ల కుటుంబం రూ.10 లక్షలను సనకు ఆఫర్ చేసింది. దీనికి సన కూడా సమ్మతించిందని సమాచారం. అయితే ఈ లావాదేవీలో జాప్యం జరగడం, అంతలోగానే సారిక పిల్లలతో సహాసజీవ దహనం కావడంతో సన చిక్కుల్లో పడిపోయింది. ఘటన జరిగిన వెంటనే పరారైన సన, ఖమ్మంలో తలదాచుకున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే ఓ మధ్యవర్తి సహాయంతో సన తమ ఎదుట లొంగిపోయిందని కోర్టుకు వరంగల్ పోలీసులు చెప్పారు. కాగా.. సారిక మృతికేసులో సిరిసిల్ల రాజయ్యతోపాటు ఆయన భార్య మాధవి, అనిల్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more