Pawan kalyan will meet ap cm Chandrababu Naidu

Pawan kalyan will meet ap cm chandrababu naidu

Pawan Kalyan, Pawan kalyan meet Chandrababu, AP, Land pooling, Amaravati, Chandrababu Naidu, Janasena, Janasena Party, Pawan kalyan on AP Issues

Janasena President Pawan Kalyan will meet AP CM Chandrababu Naidu in the afternoon. He will discuss about Amaravati, farmers land issue and special status for ap.

మధ్యాహ్నం చంద్రబాబుతో పవన్ భేటి

Posted: 11/12/2015 08:05 AM IST
Pawan kalyan will meet ap cm chandrababu naidu

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటి మధ్యాహ్నం 12 గంటలకు కుదిరింది. నిన్న సిఎం అపాయింట్ మెంట్ కోరిన పవన్ కళ్యాన్.. సిఎం కార్యాలయం నుండి సానుకూల స్పందనను అందుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయి... అమరావతి కోసం రైతుల నుండి తీసుకున్న భూముల గురించి, రైతులకు అందిస్తున్న సహాయం, ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద కూడా చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా రాజధాని గ్రామాల్లో రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తు.. చంద్రబాబుతో కలిసి లాండ్ పూలింగ్ మీద నిరసన స్వరాన్ని వినిపించారు.

ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత భేటీ అవుతున్నారు. అంతకు ముందు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం అందినా కానీ సినిమా షూటింగ్ వల్ల రాలేకపోయారు. చంద్రబాబు స్వయంగా అమరావతి శంకుస్థాపనకు రావాలని ఫోన్ చేసి ఆహ్వానించారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో భేటీకి పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ లభించింది. దీంతో నేటి ఉదయం పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10.30 గంటలకు పవన్ చేరుకుంటారు. పవన్ కల్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత 11 గంటలకు పవన్ కల్యాణ్ రాజధాని రైతులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తదనంతరం ఆయన 12 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles