దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన బీహార్ ఎన్నికల్లో ఎట్టకేలకు మహాకూటమి ఘనవిజయం సాధించి, మోదీ ప్రభుత్వానికి నిరాశే మిగిల్చింది. అప్పటిదాకా ఈ ఎలక్షన్స్ లో మోదీయే గెలుస్తాడని అంతా ఊహించారు కానీ.. ఫలితాలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ విషయం అలావుంచితే.. ఈ ఎన్నికల్లో మరో విశేషమైన విషయం చోటు చేసుకుంది. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు వంటి నేరారోపణలతో జైల్లో మగ్గుతున్న జేడీయూ మాజీ అనంత కుమార్ సింగ్ (బాహుబలి) అఖండ విజయం సాధించి, తన సట్టా చాటాడు. మరోసారి తాను నిజమైన ‘బాహుబలి’గా పేరుగాంచాడు.
ఒకప్పుడు జేడీయూ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి పలు నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లి ఆ పార్టీని వదిలేసిన అనంత సింగ్(బాహుబలి) అలియాస్ చోటే సర్కార్ తిరిగి మరోసారి తన సత్తా చాటాడు. ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనకుండా జైలు ఉండే తన హవా చూపించి, అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. తిరిగి అదే జేడీయూ పార్టీకి చెందిన అభ్యర్థిని మట్టికరిపించాడు. గతంలో 2005, 2010లో జేడీయూ టికెట్ పై అనంత సింగ్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కిడ్నాప్, హత్యలు, అత్యాచారాల కేసులో జైలు పాలయ్యాడు. దీంతో అతడు పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడిని చాలా నెలలుగా జైలులోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో తిరిగి వచ్చాయి.
దీంతో తన సత్తా చాటుకునే సమయం మరోసారి వచ్చిందని భావించిన బాహుబలి.. ఒకప్పుడు తాను బరిలోకి దిగిన మోకామా నంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇదే స్థానంలో జేడీయూ తరుఫున బరిలో నిలిచిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్కు ఓటమి రుచి చూపించాడు. మొత్తం 18,348 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ సింగ్ కు 54,005 ఓట్లు పోలవ్వగా.. జేడీయూ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 35,657 ఓట్లు లభించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more