తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సిఎం కేసీఆర్ మీద ఫైర్ అయ్యే రేవంత్ రెడ్డి ఈసారి తెలంగాణ మంత్రులను టార్గెట్ గా చేశారు. తెలంగాణ మంత్రులు మగాళ్లలా కనిపిస్తున్నారా..? అంటూ తన కూతురు కవితతొ కేసీఆర్ అన్నట్లు.. వారంతా అటు ఇటుకాని మంత్రులు అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు మంత్రి పదవులిచ్చామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలున్నా కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ‘ఎంపీ కవిత వెళ్లి తండ్రితో ఆడవాళ్లకు మంత్రి పదవి ఎందుకివ్వలేదని అడిగితే .. ఇప్పుడున్న మంత్రులు మగాళ్లలా కనిపిస్తున్నారా అని కేసీఆర్ ఆమెతో అన్నారట.. వారంతా అటు ఇటుగాని మంత్రులు ’ అంటూ రేవంత్రెడ్డి దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో తేడా వచ్చిందని.. రేవంత్ రెడ్డి విమర్శించారు. అంతెందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెబితే జీహెచ్ఎంసీ అటెండర్ కూడా మాటవినే పరిస్థితిలేదని విమర్శించారు. అటెండర్ తో పని చేయించుకునేందుకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మంత్రికి చెప్పాల్సిన పరిస్థితి ఉందని, ఎందుకీ బానిస బతుకులు అని రేవంత్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రేవంత్రెడ్డి విమర్శించారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more