మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో ఎన్ని రికార్డుల మోత మోగించాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే.. ఆయనను అభిమానులు క్రికెట్ దేవుడిగా పరిగణిస్తారు. ఆయన రిటైర్ అయి సంవత్సరం దాటినప్పటికీ.. ఏదైనా మ్యాచ్ ను వీక్షించేందుకు ఓ మైదానానికి వెళ్తే చాలు.. అక్కడ ఆయన నినాదాలు తప్ప మరేవీ వినిపించవు. దట్ ఈజ్ మాస్టర్ క్లాస్. అటువంటి క్రికెట్ దిగ్గజంపై తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు సంధించాడు.
సచిన్ తనకున్న టాలెంట్ కు పూర్తి న్యాయం చేయలేకపోయాడని కపిల్ దేవ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ లో విశేషమైన ప్రతిభ ఉన్నా దానికి సరైన న్యాయం చేయలేకపోయాడని ఆయన అభిప్రాయపడ్డాడు. సచిన్ తన టాలెంట్ తో మరిన్ని డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడని కపిల్ వ్యాఖ్యానించాడు. సచిన్ పై తాను తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని కపిల్ తెలిపాడు. సచిన్ తన అవకాశాలను మరికొంత బాగా వినియోగించుకుని ఉంటే క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలిచిపోయేవాడని కపిల్ పేర్కొన్నాడు. క్రికెట్ రంగంలో 24 సంవత్సరాలపాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన సచిన్ కు తన ప్రతిభ నిరూపించుకునేందుకు ఎన్నో అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినయోగం చేసుకోలేకపోయాడంటూ ఆయన చెప్పాడు.
'సచిన్ కు సెంచరీలు చేయడం వరకూ తెలుసు. కానీ.. వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలన్నది తెలియదు. ఒకవేళ సచిన్ తన టాలెంట్ ను మరింత వినియోగించుకుని వుంటే.. క్రికెట్ చరిత్రలో మరికొన్నికాలాలుపాటు కీర్తి ప్రతిష్టలు అతని సొంతమయ్యేవి’ అని కపిల్ తెలిపాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తో సరితూగే క్రికెటర్ గా సచిన్ ఎదిగేవాడన్నాడు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ సరైన క్రికెటర్ అని కొనియాడాడు. సాంకేతికంగా సచిన్ లో చాలా పరిణితి ఉన్నా దానిని సక్రమంగా ఉపయోగించుకోలేదన్నాడు. సచిన్ కేవలం సెంచరీలతోనే సరిపెట్టి అతని టాలెంట్ ను పూర్తిగా బయటకు తీయలేదని కపిల్ పేర్కొన్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more