ఏపి కలల రాజధాని అమరావతి నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో అమరావతి నిర్మాణం జరగనుంది. అందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే అమరావతి గురించి జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా ఖచ్చితంగా కవరేజ్ ఉంటుందని అందరూ ఊహించారు. అయితే అంతర్జాతీయ మీడియాలో రారాజుగా పేరున్న బిబిసి ఛానల్ అమరావతి మీద ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అమరావతి వరమా విషమా అంటూ కథనాన్ని వెలువరించింది.
అమరావతి మీద BBC ఛానల్ లో వచ్చిన పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
ఏపి రాజధానిగా కొత్త ఊపిరిపోసుకుంటున్న అమరావతి నిర్మాణం కోసం ఏపి ప్రభుత్వం, కేంద్రం చేస్తున్న తప్పులను బిబిసి తన కథనంలో నిలదీసింది. రాజధాని పేరుతో ఏపీ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని బీబీసీ కథనాన్ని వెలువరించింది. రాజధాని భూముల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. రాజధాని ప్రాంతంలో రైతులెవరూ గుమిగూడకుండా ఆంక్షలు విధించారని ప్రపంచానికి తెలియజేసింది. పోలీసులను ప్రయోగించి తమ భూములను ప్రభుత్వం లాక్కుందని పలువురు రైతులు చెప్పినట్టు వెల్లడించింది. చంద్రబాబు కేవలం వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తున్నారని రైతులు బీబీసీ దగ్గర వాపోయారు.
రాజధాని ప్రాంతంలో జరగనున్న ప్రకృతి విధ్వంసంపై బిబిసి ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో రాజధాని పరిధిలో 10 మిలియన్లు అంటే కోటి చెట్లను నరికేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందని వెల్లడించింది. అమరావతిలో జరుగుతున్న తంతును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించింది. రైతుల నుంచి సేకరించిన భూమే కాకుండా మరో 49 వేల 240 ఎకరాల అటవీభూమిని డీ నోటిఫై చేయాల్సిందిగా కేంద్రం ప్రభుత్వాన్ని కోరడాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. ఇలా ఫారెస్ట్ ల్యాండ్ను తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పింది. తీసుకున్న అటవీ భూమికి రెండింతలు వేస్ట్ ల్యాండ్ను అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. నరికే ఒక్కో చెట్టు స్థానంలో మూడుమొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే అలాంటి అటవీ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కోటి చెట్లను నరికివేయడం అంటే అదో ప్రకృతి విపత్తేనని బీబీసీ కథనం చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more