నా ఆత్మహత్యకు నా తల్లిదండ్రులు, నా తమ్మడు కారణం అంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేసి సంచనం రేపిన కృపామణి కేసు కీలక మలుపు తిరిగింది. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న కృపామణి కేసును ఏపి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కృపారాణి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వ్యభిచారం చేయాలంటూ తల్లిదండ్రులు, తమ్ముడు సహా రౌడీషీటర్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేయడంపై బాధితురాలు సెల్ఫీ వీడియోలో స్వయంగా చెప్పిన ఘటన కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు జిల్లా ఎస్పీని కలిసేందుకు కృపామణి యత్నించింది. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అప్పటినుంచి పేరెంట్స్, రౌడీషీటర్ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకుంది. నిందితులపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు అడిషనల్ డీజీపీ ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగారు....పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తణుకు, భీమవరం, హైదరాబాద్, విశాఖపట్నంలో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని, కృపామణిని వేధింపులకు గురిచేసినట్టు ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more