Modi brings soil and water but no Special Package

Modi brings soil and water but no special package

modi, special status, ap, chandrababu, amaravati, amaravati inauguration ceremony, Modi on special status

The much awaited Prime Minister Narendra Modi’s speech at Amaravati foundation event passed away with no concrete announcement regarding Special Status or Special Package to the state. All that hype and anticipation about Bihar like Special Package fizzed off badly with PM not speaking a word about it.

అమరావతి వేదికగా ఆంధ్రులకు నిరాశ

Posted: 10/23/2015 10:44 AM IST
Modi brings soil and water but no special package

ఏదో అనుకుంటే.. ఏదో జరిగిందే.. అన్నట్లుంది ఆంధ్రుల పరిస్థితి. అమరావతి శంకుస్థాపన అంగరంగ వైభవంగా నిర్వహించినా కానీ చాలా మంది అసంతృప్తితోనే వెనుదిరిగారు. అలా ఎందుకు అనుకుంటున్నారా..? ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి, ఏపికి ఏదో ఒక స్పెషల్ ప్రకటన చేస్తారని అంతా అనుకున్నా కానీ అది నిరాశనే మిగిల్చింది. కేవలం రాష్ట్రానికి న్యాయం చేస్తామని మాత్రమే మోదీ ప్రకటించడం.. ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడకపోవడంతో అమరావతికి వచ్చిన చాలా మంది నిరాశ చెందారు. పార్లమెంట్‌ ఆవరణ నుంచి తీసుకొచ్చిన మట్టి, యమునా నది నీటి కలశాలను ముఖ్యమంత్రికి అందించారు. కానీ 13 జిల్లాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వరాల ప్రకటనలు మాత్రం ప్రధాని నోటి నుంచి రాలేదు. పునర్విభజన చట్టం అమలు గురించి మాత్రమే ప్రస్తావించారు.

రాష్ట్రాన్ని ఆదుకోమంటూ అంతకు ముందు సీఎం చంద్రబాబు వేదిక మీది నుంచి ప్రధానికి పదేపదే విన్నపాలు చేశారు. విభజనతో వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకుని ముందుకు పోతామంటూ తెలంగాణ సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు బుడిబుడి అడుగులు వేస్తున్న ఏపి రాష్ట్రానికి కేంద్రం ఊతానందించాలని అమరావతి వేదికగా చంద్రబాబు మోదీని విన్నవించారు. కానీ మోదీ మాత్రం అసలు మ్యాటర్ తప్ప అన్నీ మాట్లాడి తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రధాని నుంచి రావాల్సిన ప్రకటన రాకపోవడం లోటుగా ఉందని రాజధాని కార్యక్రమానికి వచ్చిన చాలామంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీ...ఈరెండింటిలో ఏదో ఒకదానిపై ఆశలు పెట్టుకుంటే...నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles