రాష్ట్ర ఖజానాను నింపుకునే పనిలో ఈ ఏడాది నుంచి రెండేళ్ల పాటు కొనసాగనున్న మధ్యం దుకాణాలకు లైన్సులు జారీ చేసే ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వం మరో ఆదాయ వనురుగా మారిన బార్ అండ్ రెస్టారెంట్ ల లైసెన్సులపై దృష్టి సారిందింది. దీంతో బార్ లైసెన్సులకు కొత్తగా ధరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ పిలువగా, విపరీతమైన పోటీ ఏర్పడింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జీహెచ్ఎంసీ, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా 130 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 60 బార్లకు దాదాపు 200 దరఖాస్తులురాగా, మిగతా 70 బార్ల కోసం ఏకంగా 1,900 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హతగల దరఖాస్తులను ఎంపిక చేసే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో గత జూన్ వరకు 756 బార్లు ఉండగా జనాభా ప్రాతిపదికన బార్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న 497 బార్లకుగాను మరో 60 అదనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రస్తుతం 7 బార్లు ఉండగా కొత్తగా మరో 4 ఏర్పాటు కానున్నాయి. అలాగే రామగుండం కార్పొరేషన్లో ప్రస్తుతమున్న 6 బార్లను 8కి పెంచనున్నారు. 21 నగర పంచాయతీల్లో 30 బార్లు, 20 మున్సిపాలిటీల్లో కొత్తగా 29 బార్లు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నగర పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉండే లాడ్జింగ్లు, రెస్టారెంట్లు, రిటైల్ మద్యం దుకాణాల యజమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more