అమరావతికి అందరూ వస్తున్నారు... మోదీ దగ్గర నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా లక్షల మంది సమక్షంలో అంగరంగ వైభవంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది ఏపి ప్రభుత్వం. కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారి సంఖ్య భారీగా ఉండగా.. హాజరు కాని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎంత మంది వస్తున్నారో లెక్కించడం కష్టమే.. కానీ ఆహ్వానించినా రాని వారి జాబితా చాలా చిన్నగా ఉంది. తాజాగా తాము అమరావతి శంకుస్థాపనకు రావడం లేదని వెల్లడించారు ఏపి కాంగ్రెస్ నాయకులు. మాజీ మంత్రి శైలజానాథ్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. కాగా ఏపి కాంగ్రెస్ నాయకులు ఎందుకు రావడం లేదు అన్న కారణం కొత్తగా అనిపిస్తోంది. అందరూ అమరావతికి పయనమవుతుంటే.. ఏపి కాంగ్రెస్ నాయకులు మాత్రం అందుకు విరుద్దంగా ఆలోచిస్తున్నారు.
అసలు ఏపి కాంగ్రెస్ నాయకులు చెప్పిన కారణం ఏంటో తెలుసా..? అమరావతి ఆహ్వానం సరిగ్గా లేదట. అవును అమరావతి ఆహ్వానం సరిగ్గా లేదని ఆరోపిస్తూ.. ఏపి కాంగ్రెస్ నాయకులు అమరావతి శంకుస్థాపనకు రావడం లేదని స్పష్టం చేశారు. అమరావతి శంకుస్థాపనకు తనను పిలిచినా... రానని.. ఆహ్వానం అందించవద్దని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ సార్టీ నాయకులు కూడా రావడం లేదని ప్రకటించడం వార్తల్లో నిలుస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రధాని మోదీని అపాయింట్ మెంట్ కోరితే.. ఇవ్వలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వివరించారు. మొత్తంగా ముందు పిల్ల కాంగ్రెస్ తర్వాత తల్లి కాంగ్రెస్ నాయకులు తాము అమరావతి అంకురార్పణకు రావడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు దృష్టిలో ప్రతీసారి పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అనే మాటలు... ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. పార్టీల పేర్లు వేరయినా కానీ రెండింటి ఆలోచనా విధానం మాత్రం ఒక్కటేలా ఉంది అని కొంత మంది విమర్శిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను ఎందుకు రావడం లేదో వివరిస్తు... జగన్ రాసిన లెటర్ మీద చాలా మంది విమర్శలు చేశారు. జగన్ అసంబద్ద కారణాలను సాకుగా చూపిస్తూ.. ఆంధ్రుల చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక ఘట్టానికి హాజరుకాకపోవడం మీద సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారు. మరి జగన్ చెప్పినట్లే కనీసం నమ్మడానికి వీలుకాని వాటిని సాకులుగా చూపుతూ తల్లి కాంగ్రెస్ నాయకులు అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టడం ఏంటా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తాము పాల్గొన్నా కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు చెల్లుతుంది తప్పితే.. తమకు ఎలాంటి ప్రయోజనం కలుగదు అనే భావనతోనే కాంగ్రెస్ ద్వయం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు కూడా పుకార్లు షికారు చేస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more