తిరుమల తిరుపతిలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుండి భక్తులు తరలివచ్చారు. కనుల పండుగగా సాగే.. బ్రహ్మోత్సవాలను కనులారా చూసితరించాలని వచ్చిన వారికి అర్చకుల మధ్య తగాదా కొత్తగా అనిపిస్తోంది. తిరుమల శ్రీవారి సేవలో ఉన్న అర్చకుల మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వివాదాలు ఏకంగా బ్రహ్మోత్సవాల వేళ భక్తుల ముందే బయటపడ్డాయి. తిరుమల వచ్చే భక్తులు ఇప్పుడు బ్రహ్మోత్సవాల కన్నా అర్చకుల మధ్య జరుగుతున్న వివాదం గురించే మాట్లాడుతున్నారు. రమణదీక్షితులు, వేణుగోపాల్ దీక్షితులు మధ్య నడుస్తున్న వివాదంపై అటు భక్తులు ఇటు టిటిడి గుర్రుగా ఉన్నారు. కాగా తిరుమల దేశాలయంలో ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులు తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని రోజుకో రూపంలో వివిధ వాహనాల మీద ఊరేగించడం జరుగుతుంది. కాగా నేడు సూర్యప్రభ వాహనం మీద శ్రీవారు ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనం వద్ద ముందుగా వేణుగోపాల్ దీక్షితులకు డ్యూటీ వేసింది టిటిడి. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆ డ్యూటీని రమణదీక్షితులు వత్తిడి మేరకు మార్చింది. దాంతో రమణదీక్షితులు, వేణుగోపాల్ దీక్షితులు మధ్య వాగ్వాదం జరిగింది. తిరుమల ప్రధానార్చకులుగా రమణ దీక్షితులు మాట నెగ్గింది. దాంతో అక్కడి నుండి వేణుగోపాల్ దీక్షితులు వెళ్లిపోయారు. కాగా వాహన సేవ ప్రారంభం కాగానే ప్రధానార్చకులు ప్రధానాలయంలో స్వామి వారి కైంకర్యాలను నిర్వహించడం జరుగుతుంది. కానీ రమణ దీక్షితులు సూర్యప్రభ వాహనం మీద స్వామి వారి సేవలో కనిపించడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి తిరుమలలో అర్చకుల మధ్య వాగ్దాదం భక్తులకు అసౌర్యాన్ని కలిగిస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more