దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా కేసులో భాగంగా ప్రస్తుతం సీబీఐ పరుగులు పెడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి అయిన ఇంద్రాణి ముఖర్జియా ఇటీవల ఇచ్చిన వివరణ మేరకు వారు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆమె ఏం చెప్పింది? అని అనుకుంటున్నారా..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
ఈ కేసులో భాగంగా ముందునుంచి ఇంద్రాణి ముఖర్జియా రకరకాల స్టేట్ మెంట్లు ఇస్తూ వచ్చింది. ఆమధ్య ఇంద్రాణి బత్రికేవుందని బాంబ్ పేల్చడంతోపాటు అసలు ఆమె తన కూతురేకాదంటూ పేర్కొంది. దాంతో పోలీసులు ఈమె డీఎన్ఏతో షీనా డీఎన్ఏతో పోల్చగా ఆమె తల్లే అని తేలిపోయింది. తదనంతరం ఈ కేసు నుంచి తప్పించుకుని బెయిల్ పొందేందుకు అనారోగ్యబారిన పడింది. అయితే.. పోలీసుల ముందు ఆమె పప్పులు ఉడకలేదు. ఇప్పుడు సీబీఐ చేతికి దక్కిన ఈ కేసు విచారణలో భాగంగా షీనా ఓ సంచలన వ్యాఖ్య చేసింది. తన కూతుర్ని చంపింది తాను కాదని, తన భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ ఇద్దరూ కలిసి షీనాను చంపేశారని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది.
సోమవారం ముంబయి, కోల్ కతా, గువాహటి వంటి తొమ్మిది చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. షీనా సోదరుడు మిఖెయిల్ బోరా ఇంట్లో కూడా సోదా చేసింది. అయితే, కేసు దర్యాప్తులో భాగంగానే తన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించిందని, తాను దర్యాప్తు అన్ని విధాల సహకరిస్తానని చెప్పాడు. ఈ కేసులో ప్రధాన నిందితులై ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తో పాటు మరికొందరు అనుమానితులకు సంబంధించిన ప్రాంతాల్లో కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం గాలింపులు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more