దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతున్న ఈ కేసులో ప్రధాన నిందితురాలైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా తాజాగా సీబీఐకి కీలక వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తన కూతురు షీనా బోరాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ఇద్దరూ కలిసి ఆమెను హతమార్చారని ఇంద్రాణి సీబీఐకి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
సీబీఐ అధికారులకు ఇంద్రాణి ఇచ్చిన వివరాల ప్రకారం.. షీనా పెరుగుతున్న తీరును ఆమె తండ్రి ఖన్నాను కలవరపెట్టిందని, ముఖ్యంగా ఆమె తన (ఇంద్రాణి) మరో భర్త పీటర్ ముఖర్జియా కుమారుడితో సంబంధం పెట్టుకోవడం అతడికి ఏమాత్రం నచ్చలేదని ఆమె తెలిపింది. తన సొంత కూతురుపై ఆ ప్రభావం పడుతుందేమోననే భయంతోనే ఆమెను ఖన్నా హత్య చేశాడని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. తొలుత బాంద్రాలో సంజీవ్ ఖన్నాతో ఏర్పాటుచేసిన ఓ డిన్నర్ కార్యక్రమానికి తాను తన కూతురు షీనాబోరాను ఆహ్వానించినట్లు ఇంద్రాణి సీబీఐ వర్గాలు తెలిపింది. ఆ తర్వాత పథకం ప్రకారం ఆమెను సంజీవ్ ఖన్నా, డ్రైవర్ చెప్పేసి వుంటారని తెలుస్తోంది.
ఈ హత్యకు తనకు ఏ సంబంధం లేదని, సంజీవ్ ఖన్నా, డ్రైవర్ మాత్రం హత్యచేశారని వివరణ ఇచ్చింది. మరోపక్క, ఏ విధమైన విచారణకైనా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, వివరాలు తెలియజేస్తానని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. దీంతో.. ఆమె ఇచ్చిన వివరణ నిజమే అయివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఇచ్చిన వివరణ ప్రకారం సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more