కేసీఆర్ కూతురిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవితకు గుర్తింపు ఉంది. నిజామాబాద్ ఎంపీగా జాతీయ స్థాయిలో కూడా కవితకు మంచి గుర్తింపు ఉంది. అయితే తాజాగా కవిత మీద విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రైతులకు అండగా నిలవాలని.. వారి కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది. అయితే రైతుల పేరుతో కవిత దందా మొదలుపెట్టిందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవిత కొత్తగా రైతుల పేరుతో దందాకు దిగుతున్నారని... ఆరోపించడంతో వివాదం రాజుకుంది. అంతకు ముందు కవిత తెలంగాణ జాగృతి తరఫున చనిపోయిన వారి కుటుంబాల్లో కొన్ని కుటుంబాలకు ప్రతి నెల 4500 ఆర్థిక సహాయం చెయ్యాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ తన మీద వచ్చిన ఆరోపణల మీద కొత్తగా స్పందించారు కవిత.
తెలంగాణ జాగృతి రైతుల పేరుతో దందాకు దిగిందని.. వసూళ్లకు పాల్పడుతోందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అయితే బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తాను ఎలాంటి రాజకీయ విమర్శలు చెయ్యను అని కవిత వెల్లడించింది. మధుయాష్కీ చేసిన ఆరోపణల మీద మీ స్పందన ఏంటి..? అని మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కవిత ఇలా తొమ్మిది రోజులు ఖామోష్ అంటూ బదులిచ్చారు. అయినా ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్ కానీ. ఇలా పండగ పేరుతో కూడా బ్రేక్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తోంది. మరి చూడాలి.. పంగడ తర్వాత కవిత ఎలా స్పందిస్తుందో
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more